Shivudu smashanam lo thiragadam venuka gala rahasyam yemiti?

0
14993

త్రిమూర్తులలో పరమేశ్వరుడు ఒకడు. ఈయననే శివుడు, బోలానాథుడు, నీలకంఠుడు, త్రినేత్రుడు ఇలా అనేక రకాలుగా పిలుచుకుంటారు. మన దేశంలో శివుడి యొక్క శివాలయాలు చాలానే ఉన్నాయి. అయితే శివుడు సన్యాసి వలే స్మశానంలో సంచరిస్తాడని చాలా కథల్లో విన్నాము. మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలోనే శివుడు ధ్యానం వెనుక ఒక రహస్యం అనేది ఉంది. మరి ఆ రహస్యం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.shivuduశరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన తర్వాత మిగిలే బూడిదను ఒంటికి రాసుకుని, కపాలమాలను శివుడు మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించడమనేది సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడని అర్థం. ఆయనకు విషమైనా, అమృతమైనా సమానమే.shivuduశివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది. ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీ దేవి స్వయంగా ప్రస్తావిస్తుంది. దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే, పార్వతి నేనేమి స్మశానంలో ప్రయత్న పూర్వకంగా కూర్చోవడం లేదు లోకంలో ఉగ్రమైన భూతములన్ని కొలువైవున్న ప్రాంతం శ్మశానం. ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరుగకుండా భూతప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి.
దీన్ని గమనించిన బ్రహ్మ స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు. లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళకార్యాన్ని అడ్డుకుంటున్నాయి.పైగా, ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డా మీ బిడ్డలే కదా. అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా. మీ పిల్లలు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై వుండాలని ప్రార్థించాడు. అందువల్లే నేను శ్మశానంలో కొలువైవున్నాను అని చెప్పాడు.shivuduఇది మొదటి కారణం కాగా, మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. జీవించి ఉన్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు, ఆకటితో అలమటించే కడుపేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు. shivuduచివరి కారణం ఏంటి అంటే జీవించివున్నంతకాలం నావాళ్లూ నావాళ్లూ అంటుంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో వదిలి వెళ్లిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు పార్వతికి శివుడు చెపుతాడు. shivuduఅసలు ఈ లోకమే ఓ శ్మశానం. చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా. గృహాల్లో, ఆస్పత్రుల్లో, రోడ్లపై, పార్కుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ చనిపోతున్నారు. అంటే ఈలోకమంతా ఓ శ్మశానమే. ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం. ఈ ప్రాంతంలో నేను నివశిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు. పైగా, ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతమేదైనా ఉందంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు. shivudu
దేవుడైన పరమశివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడా అనే దానికి ఈ విషయం ద్వారా మనకి స్పష్టంగా తెలియుచున్నది.