అశ్వమేధయాగం ఉద్దేశం ఏంటి? ఈ యాగాన్ని ఎందుకు చేస్తారు ?

వేదకాలం నుండి రాజ సంప్రదాయంలో అతి ముఖ్యమైనది అశ్వమేధయాగం. ఈ యాగం గురించి యజుర్వేదం లో ఉంది. మరి ఈ యాగం ఉద్దేశం ఏంటి? ఈ యాగాన్ని ఎందుకు చేస్తారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ashwamedha Yagam

అశ్వమేధయాగాన్ని కేవలం రాజ వంశులు మాత్రమే చేస్తారు. ఈ యాగానికి 20 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలుజాతి గుర్రాన్ని మాత్రమే వాడతారు. ఈ యాగాన్ని సాధారణంగా రాజ్యంలో నీరు లేక కరువు ఏర్పడినప్పుడు జల సదుపాయం కోసం చేస్తారు. అశ్వనికి అర్ధం గుర్రం, రంగు, నీరు అనే అర్దాలున్నాయి. అయితే శతపద బ్రాహ్మణంలో ఒకచోట సోముడి కంటి నుండి జలజలా కరంగా ఆ జలం నుండే గుర్రం పుట్టినది. అశ్రువుల నుండి పుట్టిన జివి కనుక దాన్ని అశ్వం అని అన్నారు.

Ashwamedha Yagam

ఈ యాగానికి అన్ని శుభలక్షణాలు ఉన్న గుర్రాన్ని చూసి స్వేచ్ఛగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేసి దాని వెనుక కొంత సైన్యం వెళుతుంది. ఈ అశ్వం పక్క రాజ్యాలకి వెళ్ళగానే అక్కడి వారు గుర్రం కలవారికి కరువు వచ్చినదని వారికీ సహాయం చేస్తారు లేదా గుర్రాన్ని బంధించగా అశ్వం వెంట వచ్చిన సైనికులు వారథి యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచిన సంధి ఉంటుంది. ఇలా అశ్వాన్ని బంధించేవారు కరువు వచ్చిన రాజ్యానికి విలువైన కానుకలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చివరకు యాత్ర అనేది ముగిస్తుంది.

Ashwamedha Yagam

ఈవిధంగా యాత్ర ముగిసాక దేవతలను తృప్తి పరిచేవిధంగా యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞంలో అశ్వాన్ని బలిస్తారు. ఇక గుర్రం యొక్క అంగాలు దేవుళ్ళకి నైవేద్యముగా స్వాహా అంటూ అగ్నిగుండంలో వేస్తారు. రామాయణం, మహాభారతం ఇతర పురాణాల గురించి చెప్పే గ్రంధాలలో అశ్వమేధం గురించి వివరంగా చెప్పబడింది.

Ashwamedha Yagam

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR