గంట ఆలయం ఎక్కడ ఉంది ? ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటో తెలుసా ?

మన దేశంలో ఉన్న పురాతన ఆలయాల నిర్మాణం, శిల్పకళా నైపుణ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అదేవిధంగా ఈ ఆలయంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయ గర్భగుడిలో, నంది విషయంలో, గర్భగుడిలో ఉన్న గంట విషయంలో ఇలా ఎన్నో రకాల విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

RamaLingeswara Swamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, సంతరావురు అనే గ్రామంలో శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం గా చెబుతారు. ఈ ఆలయాన్ని చోళ రాజు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంభువు అని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో రెండు నందులు ఉండగా, గర్భగుడిలో దేవుడికోసం వెలిగించిన దీపాన్ని ఈ రెండు నందులు కూడా చేసేవిధంగా ఆలయ నిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

RamaLingeswara Swamyఇది ఇలా ఉంటె, సాధారణంగా ప్రతి ఆలయంలో ఉన్న గంటని ఒకసారి మోగిస్తే రెండు లేదా మూడు సార్లు ప్రతిధ్వనిస్తుంది, కానీ ఈ ఆలయంలో మాత్రం గంటని ఒకసారి మోగిస్తే 108 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్న ఈ గంట నుండి ఓంకారం స్ఫష్టంగా వినిపిస్తోందని అక్కడి భక్తులు చెబుతారు. ఇలా కాశీలో విశ్వనాథుని ఆలయంలో ఉన్న గంటకి మరియు ఆ తరువాత ఈ ఆలయంలో నే ఇలాంటి ఓంకార శబ్దం రావడం విశేషం. ఇంకా ఈ ఆలయంలో గంగామాత విగ్రహాన్ని ఇద్దరు శిల్పులు చెక్కారని ఇక్కడి శిలాశాసనం పైన ఉంది.

RamaLingeswara Swamyఇక ఈ ఊరిపేరు విషయానికి వస్తే, పూర్వం ఈ ఉరి పేరు రావూరు అని ఉండేది. ఇక్కడ ఉన్న కాలువ ద్వారా ఇతర ప్రాంతాల నుండి సరుకులు ఈ గ్రామానికి వచ్చేవి. ఇలా వారానికి ఒకసారి వేరే ప్రాంతం నుండి ఈ గ్రామానికి సరుకులు రావడం అప్పుడు సంత ఏర్పాటు చేయడంతో రావూరు కాస్త సంతరావురుగా మారిందని చెబుతారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న దేవాలయానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుండి భక్తులు ఎక్కువగా తరలి వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR