పార్వతీదేవి మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి ఎందుకు పూజలు చేసింది ?

శివుడు ఆగ్రహానికి గురై ఒక సందర్భంలో పార్వతీదేవిని శపించగా భూలోకానికి వచ్చిన పార్వతీదేవి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిన ప్రదేశంలోనే ఈ ఆలయం ఉన్నదని పురాణం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ శివలింగానికి నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shivudu parvathi

తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లా, శివకంచిలో శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. శివకంచిలోని ప్రధాన ఆలయాల్లో శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి. ఈ దేవాలయములో ఉండే ప్రధాన దైవం శివుడు. ఇక్కడ భక్తులు స్వామిని ఏకామ్రనాధుడు, ఏకాంబరుడు అని పిలుస్తుంటారు. ఏకామేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థం. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి. ఇంకా ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ 1008 శివలింగాలు, వెయ్యి స్థంబాల కళామంటపం ఉన్నాయి. ఇంకా పంచభూతలింగాల్లో ఒకటి ఈ కంచి ఏకాంబేశ్వరాలయం.

shivudu parvathi

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒకప్పుడు శివపార్వతులు కైలాసంలో పాచికలాడుకుంటూ ఉండగా ఆ ఆటలో శివుడు ఓడిపోతే పార్వతీదేవి ఎగతాళి చేసిందంటా. అందుకు కోపానికి గురైన శివుడు కురూపివికమ్మని పార్వతిని శపించాడంటా. అప్పుడు తప్పు తెలుసుకొని పార్వతి శివుణ్ణి ప్రార్ధించగా, శివుడు శాపనివారణ మార్గాన్ని చెప్పాడు.

shivudu parvathi

ఆ ప్రకారం, పార్వతిదేవి ఈ భూలోకంలో ఒకే ఒక పండు మాత్రమే కాచే ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని మట్టితో లింగాన్ని చేసి పూజించడం ప్రారభించిందంటా. శివుడు పార్వతిని పరీక్షించాలని తన జటాజూటంలో నుంచి గంగను అమితవేగంతో పారేటట్లు జారవిడిచాడంటా. ఆ ప్రవాహానికి పార్వతి తాను రోజు పూజిస్తున్న శివలింగాన్ని గట్టిగ కౌగిలించుకొని నిర్భయంగా ఉండిపోయిందంటా. అప్పుడు శివుడు సంతృప్తి చెంది శాపాన్ని విరమించి అంత్యంత సుందర రూపం అనుగ్రహించాడంటా. ఆ తరువాత పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఈ మామిడి చెట్టు కిందనే ఉండిపోయాడు అందుకే ఆయనకు ఏకామ్రనాథుడు అనే పేరు వచ్చినది. ఇలా ఇక్కడ నూతన సౌందర్యంతో వెలసిన ఈ పార్వతి దేవికి కన్నులు ఆకర్షణీయంగా ఉండటంతో ఈమెకి కామాక్షి అని పేరు వచ్చినది.

shivudu parvathi

అంతేకాకుండా పార్వతిదేవి తయారుచేసిన ఆ శివలింగాన్ని మహాలింగంగా భావించి పూజిస్తారు. ఈ శివలింగానికి నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. మిగిలిన అభిషేకాలు పక్కన ఉండే రాతి శివలింగానికి చేస్తారు. అమ్మవారు తపస్సు చేసిన ఆ మామిడి వృక్షం యొక్క కాండాన్ని ప్రస్తుతం అద్దాల పెట్టాలో ఉంచి దేవాలయములో భద్రపరిచారు.

shivudu parvathi

ఇంత గొప్ప స్థలపురాణం ఉన్నదీ కనుకే శివకంచి లోని అన్ని ఆలయాల్లో ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR