ఇక్కడ వెలసిన ఆ గంగమ్మ తల్లిని గ్రామస్థులు గ్రామదేవతగా కొలుస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే గంగమ్మ తల్లికి ఎనిమిది రోజులు పాటు జరిపే ఉత్సవంలో అక్కడి భక్తులు దేవిని తిట్టిపోస్తుంటారు. గంగమ్మను ఎంత తిడితే ఆమెకు అంత ఆనందమని ప్రతీతి. మరి ఆ తల్లి అక్కడ ఎలా వెలసింది? ఇంకా ఈ ఆలయంలోని విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం.
ఇక స్థల పురాణానికి వస్తే, పూర్వము మన దేశాన్ని వాబులు పాలించే సమయంలో దక్షిణ భారతదేశంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ద్యేయంతో ఎన్నోసార్లు దండయాత్రలు చేసి అక్కడి జమిందారులను, పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేసెవారు.