‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రభాస్ ఫ్యాన్సందరూ దాదాపు రెండేళ్ళుగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఎంతోఅసక్తిగా ఎదురుచూసారు. ఎట్టకేలకు ‘సాహో’ టీజర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్.
టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎవ్వరూ చూపించని యాక్షన్ థ్రిల్లర్ ని ‘సాహో’ చూపించబోతున్నాడని ఓ క్లారిటీ వచ్చేసింది. ఈరోజు విడుదలైన ‘సాహో’ టీజర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. కళ్ళు చెదిరేలా ఈ టీజర్ విజువల్స్ ని చూపించారు ఈ చిత్రంలో…! తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళంలో ‘సాహో’ టీజర్ ను విడుదల చేసారు. ఇక ‘సాహో’ టీజర్ అద్భుతమంటూ మన టాలీవుడ్ సెలెబ్రిటీలు అంతా తమ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్ పై స్పందించిన వారెవరంటే :
1) రాజమౌళి:
2) నాగార్జున
5) శ్రద్దా కపూర్
16) సుబ్బరాజు
మొత్తానికి ‘సాహో’ టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇక ట్రైలర్, సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టడం ఖాయమనే చెప్పాలి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ‘సాహో’ రిలీజ్ డేట్ ఆగష్టు 15 కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Watch Saahoo Teaser Here