పురాతన కాలం నుండి పూజలందుకొంటున్న ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే అందులో చాలా వరకు కొండపైన, గుహల్లో, అరణ్యప్రాంతాల్లో వెలసినవి. అలా ఒక కొండగుహలో వెలసిన ఆలయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే కొండగుహలోని చిమ్మచీకట్లోనే దేవుడు దీపం వెలుగులో భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. మరి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ చీకటి మల్లయ్య ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.