తిరుమల వెళ్ళినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మర్చిపోవద్దు…

  • కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సంవత్సరం పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మ్రొక్కులు తీర్చుకుంటుంటారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న ప్రదేశంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు.
1
  • వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూసేందుకు దర్శనం అయ్యాక చాలా మంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు.
2
  • పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిదిమంది , స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిదిమంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు.
  • నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహా పాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నెండేళ్ళ పాటు భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి, పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.
3
  • ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ, అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది.
4
  • అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది. తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా విమాన వెంకటేస్వరుడ్ని, స్వామి పాదాలనూ దర్శించటం మరవకండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR