మానవుని లోకంలో వివాహం ఎనిమిది విధాలుగా వుంటుంది. అవి, బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. అంటే ఏమిటో తెలుసుకుందాం.
యోగ్యుడైన వరుడిని పిలిచి, అలంకరించిన కన్యను ఇచ్చి చేసే వివాహాన్ని బ్రాహ్మము అంటారు. ఈ దంపతులకు పుట్టిన కొడుకు ఇరవైతరాలవరకు వారిని తరింపజేస్తాడు. ఇది సాధారణంగా మన ఇళ్లలో జరుగుతున్నదే.
2. దైవము :
యజ్ఞంలో ఋత్విజుడుగా వచ్చిన బ్రహ్మచారికి కన్యనిచ్చి చేసే వివాహం దైవము. వీరికి పుట్టిన కుమారుడు పద్నాలుగు తరాలవారిని పవిత్రులుగా జేస్తారు.
వరుని వద్దనుండి రెండు గోవులను కన్యాశుల్కంగా తీసుకొని,కుమార్తెనిచ్చి చేసే వివాహము ఆర్షము. వీరి కుమారుడు ఆరు తరాలవారిని పవిత్రులుగా చేస్తాడు.
4. ప్రాజాపత్యము :
మీరిద్దరు దంపతులుగా ఒక్కటై గృహస్థధర్మాన్ని నిర్వర్తించండి అని వధూవరులను దీవించి చేసిన వివాహమే ప్రాజాపత్యము. వీరి కుమారుడు ఆరుతరాలవారిని ఉద్ధరిస్తాడు.
వధువు ఇష్టాఐష్టాలతో నిమిత్తం లేకుండా, వరునినుండి ధనం తీసుకొని కన్యను విక్రయించి చేసే వివాహమే ఆసురము.
6. గాంధర్వము :
వధూవరులకు యుక్త వయసు రాగానే ఒకరిని చూసి ఇంకొకరు ఇష్టపడి, పెద్దల అనుమతి లేకుండా పంచభూతాల సాక్షిగా చేసుకునే వివాహమే గాంధర్వము. కలియుగంతో సత్యం క్షీణించింది కాబట్టి ఈ వివాహం నిషేధించబడింది. పూర్వం శకుంతలా దుష్యంతులు ఈ విధంగానే దంపతులయ్యారు.
వధూవరులకు పరస్పరం ఇష్టముంటుంది. పెద్దలు అనుమతించరు. అప్పుడు వరుడు తన భుజబలంతో వారితో పోరాడి గెలిచి, కన్యను తెచ్చుకొని వివాహమాడడం రాక్షసము. పెద్దలు ఈ విధమైన వివాహాన్ని ఒప్పుకోరు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఈ విధంగానే చేపట్టాడు.
8. పైశాచము :
కన్యకు గానీ, ఆమె కుటుంబంవైపు వారికి గాని ఇష్టముండదు. అయినా వరుడు బలాత్కారంగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకునే వివాహమే పైశాచము.
తన భర్తతో సంతుష్టి పొందిన పతివ్రతను, తన ధర్మపత్నితో సంతోషం పొందిన భర్త, ఏ గృహంలో అయితే వుంటారో, అక్కడ శ్రీమహాలక్ష్మి, నారాయణునితో సహా నివసించి శుభాలు కలుగుతాయి.