ఏదైనా పండగ వస్తే దేవుడికి నైవేధ్యంగా ఏమి సమర్పించాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఏ దేవునికి ఏ నైవేద్యం పెడితే ప్రీతీ చెందుతారో తెలుసుకుందాం..
శ్రీ వేంకటేశ్వరస్వామికి :
వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో వేయాలి.
వినాయకునికి :
బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం మరియు శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.
ఆంజనేయస్వామికి :
అప్పులు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.
సూర్యునికి :
మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.
లక్ష్మీదేవికి :
క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజలు చేయాలి.
లలితాదేవికి :
క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.
సత్యన్నారాయణస్వామికి :
ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.
దుర్గాదేవికి :
మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.
సంతోషీమాతకు :
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
శ్రీ షిర్డీ సాయిబాబాకు
పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం.
శ్రీకృష్ణునికి :
అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళాలతో పూజలు.
శివునికి :
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా మరియు మారేడు దళాలు , నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.