జామ పండ్లు అందరికి అందుబాటులో ఉండేవి. జామపండును అమృత ఫలం అని కూడా అంటారు. జామ కాయలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం ఇంట్లో పెంచుకునే దివ్య ఔషదం. ముఖ్యంగా జామపండు తినడం వలన అరుగుదల గుణాలు పెరిగి ఎలాంటి మలబద్ధకం అయినా వెంటనే తగ్గుతుంది.
జామాకు కషాయం తయారుచేయు విధానం
ఐదు లేదా ఆరు జామ ఆకులను మంచినీళ్లతో కడిగి రాగి లేదా స్టీల్ పాత్రలో వేసి ఒక గ్లాసు మంచినీళ్ళు పోయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు లేదా అయిదు నిమిషాలు మరగబెట్టాలి. తరువాత వడపోసుకొని గోరువెచ్చగా కానీ, చల్లగా కానీ తీసుకోవాలి. ఈ జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలోని గ్లూకోజ్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. కనుక చక్కెర వ్యాధిని నయం చేయడానికి జామ ఆకుల కషాయం బాగా ఉపయోగ పడుతుంది.