భారతీయులు పురాతన కాలం నుండి సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆయుర్వేదంలో, వంటలో కూడా సుగంధద్రవ్యాలను ఎలా వాడాలో అనే జ్ఞానం మన పూర్వీకులకు ఉంది. అందులో భాగంగానే యలకులను ఇప్పటీకీ వాడుతూ వస్తున్నాము. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. యాలకులు చక్కని రుచిని, వాసనను అందిస్తాయి. అయితే యాలకులను వంటల్లో ఉపయోగించడం కంటే కూడా యాలకుల నీటిని తాగడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఉత్తి నీళ్లు తాగడం చాలా బోర్. ఎలాంటి టేస్టు ఉండదు. కాబట్టి దానికి కాస్తంత యాలకుల రుచి తగిలితే అలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పరగడుపునే ఒక లీటర్ గోరువెచ్చని నీటిలో కాస్తంత యాలకులు వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. పూర్తిగా బాటిల్ ఖాళీ చేయవచ్చు.