సాధారణంగా మన దేశంలో ఆలయాలు ఉదయం తెరిచి సాయంత్రం మూసేస్తారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉత్సవాలు చేసినపుడు రాజంతా ఆలయాలు తెరిచి ఉంచుతారు. కొన్ని ఆలయాలు 6 నెలలు భక్తులకు అనుమతి ఇచ్చి మిగతా సమయం మూసేస్తారు. కానీ ఒకచోట ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుందట ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. హిందు ధర్మంలో సర్పాలను(పాములను) ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగ దేవతల ఆలయాలున్నాయి. అందులో ప్రముఖమైనది, ఇతర ఆలయాల కంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగ చంద్రేశ్వరాలయం.