వివాహం ఆలస్యం అయినా వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరుగుతుందట!

వివాహం కాని వారు, వివాహంలో ఆటంకాలు వచ్చే వారు ఎక్కడెక్కడో దేవాలయాలు దర్శిస్తూ ఉంటారు. ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు శ్రీనివాస మంగపూర్ లోని వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఆటంకాలు తొలిగిపోయి త్వరగా పెళ్లి జరుగుతుందట. ఆ ప్రత్యేకత ఏమిటో ఆలయవిశేషాలు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానం పేరున ఉన్న ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రాల్లో శ్రీనివాస మంగాపురం ఒకటి. ఈ శ్రీనివాస మంగాపురంలో స్వామి వారు శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ, భక్తుల కోరికలను తీరుస్తూ విరాజిల్లుతున్నాడు.

శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి, కల్యాణోత్సవాలు జరిపించడం విశేషం. చివరలో అర్చకులు ఇచ్చే కల్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ప్రతి రోజూ తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జితసేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు. వేంకటేశ్వరుడు వివాహనంతరం అమ్మవారితో కలిసి తిరుగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 16వ శతాబద్దకాలంలో తాళ్లపాక అన్నమాచుర్యుల వారి మనువడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్దరించారని స్థల ప్రసస్థి.

శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిశ్రీనివాస మంగాపురంకు దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన మెట్లు ఉన్నాయి. యోగం, భోగం, వీరం, అభిచారిక అనే నాలుగు రకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్టిస్తారు. కాని తిరుమల శ్రీవెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు ఈ రూపాలకు అందని వాడు, అన్నింటికీ అతీతుడు కాబట్టి ఈయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్ఛావతారం. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు కూడా అర్ఛావతర స్వరూపుడే.

శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిస్థలపురాణం ప్రకారం నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీవేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు. శ్రాస్త్ర ప్రకారం పెళ్లైన దంపతులు ఆరు నెలలపాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం చేయకూడదని అగస్త్యమహర్షి చెప్పడంతో అగస్త్యాశ్రమంలో ఆరునెలలపాటు విడిది చేస్తారు. ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే తిరుమల కొండకింద కళ్యాణి నదీతీరాన ఉన్న శ్రీనివాసమంగాపురంలో ఎక్కువగా గడిపేవారు.

శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామితిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండు వరాలు ప్రసాధించినాడని పురాణాలు తెలుపుతున్నాయి. తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాసమంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శనభాగ్యం కల్పిస్తాననీ, పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లికాని వారికి కళ్యాణ సౌభాగాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు.

శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి వచ్చి, స్వామి వారి గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలికి వెళ్లకుండా వెనుతిరిగారు. ఈ సమయంలో కొంత కాలం ఆలయం మూసివేయబడింది. అప్పుడు కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామి కలలో కనబడి తాను శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్నానని, తనకు పూజాదికాలు నిర్వమించమని చెబుతారు. అప్పటి నుండి మళ్లీ ఆలయం కళకళలాడుతుంది. తిరుమలలో లాగే ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

శ్రీ కళ్యాణ వెంటేశ్వర స్వామిస్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గరలోని సువర్ణముఖీ నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణుపాదంగా కొలుస్తుంటారు….శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గర దారి. తిరుపతి అలిపిరి నుండి వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద ఉన్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు. తిరుమతికి కేవలం 12కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సులో లేక ఆటోలో వెళ్ళవచ్చు.

రోడ్డు మార్గం:

తిరుపతి బస్ స్టేషన్ నుండి శ్రీనివాసమంగాపురంకు చాలా బస్సులు ఉంటాయి. లోకల్ ఆటోల్లో కూడా చేరుకోవచ్చు. అలాగే టిటిడి వారి ఉచిత బస్సు సర్వీస్ లు కూడా ఉన్నాయి.

రైలు మార్గం:

శ్రీనివాసమంగాపురానికి అతి దగ్గరలో 15కి.మీ దూరంలో రైల్వేస్టేషన్ ఉంది. రైల్వేష్టేషన్ చేరగానే అక్కడ నుండి కళ్యాణ వేంటశ్వరుని ఆలయనికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లవచ్చు. లేదా లోకల్ ఆటోలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం:

తిరుపతి విమానశ్రయం నుండి లోకల్ ట్యాక్సీలను బుక్ చేసుకుని, శ్రీనివాసమంగాపురం చేరుకోవచ్చు. తిరుపతి విమానశ్రయం నుండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని శ్రీనివాసమంగాపురంకు 12కి.మీ దూరంలో ఉంది .

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR