పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి ప్రాంతంలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం పంచారామక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ప్రాచీన దేవాలయం. శాపగ్రస్థుడైన చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శాపవిముక్తుడైనట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. బోళా శంకరుడైన శివయ్య ఇక్కడ ‘సోమేశ్వరస్వామి’ పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ వుంటుంది. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతుంటారు. మరి ఇలా మారడనికి అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం.