భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే శ్రీవేంకటేశ్వరస్వామి కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఇక్కడ కొండపైన కొన్ని రోజులు ఉన్నాడని స్థల పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చాలామంది అప్పులు చేస్తుంటారు. మరి మన ఆర్థిక ఇబ్బందులను తొలగించే మనకు అప్పులు తీర్చమని చాలామంది ఆ దేవతలను వేడుకుంటారు.
ఈ విధంగా అప్పులు సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు. హైదరాబాద్ వరంగల్ హైవే చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.
ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనే వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి రుణబాధలు తీరుతాయని భావిస్తారు. అసలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అప్పులు ఏవిధంగా తీరుతాయనే విషయానికి వస్తే. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం కోసం కుబేరుని వద్ద తీసుకున్న విషయం మనకు తెలిసిందే.