ప్రస్తుత వైరస్ విపత్కర కాలంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అందుకే హెల్దిగా ఉండడానికి ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ముఖ్యంగా కరోనావైరస్ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవరసం ఉంది. కానీ చాలా మందికి టీలేనిదే రోజు గడవదు. అందుకని ఆ టీతో ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలని అనుకునే వారు చేస్తున్నది టీ లు, కాఫీ లు మానేసి గ్రీన్ టీ బాట పట్టారు. మరికొందరు బ్లాక్ టీ కూడా తాగేస్తున్నారు. ఇంకొందరు మరికొంచెం ముందుకు వెళ్లి జామ ఆకులతో, గులాబీ రేకులతో, మందారం పూవులతో టీ లు తయారు చేసుకుని తాగేస్తూ ఉన్నారు.