తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ ఈ పండు చుట్టూ ఒక పొడుపు కథనే అల్లేసారు. అదే పనస పండు. పనస పండులో ఓ పస ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే మనమూ గుర్తిస్తున్నాం.. పాశ్చాత్య దేశాలు కూడా పనసను మనసారా ఆస్వాదించడం మొదలు పెట్టాక ఆ పండు విలువ ఆకాశమే హద్దుగా సాగిపోయింది.
పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.- పనస పండులో ఉండే పొటాషియం తో గుండెపోటును దూరం చేసుకోవచ్చు.
పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్-C, విటమిన్-A పుష్కలంగా ఉంటాయి.- పెద్ద ప్రేగు (కోలన్) క్యాన్సర్ను దూరం చేసే యాంటీ-యాక్సిడెంట్లు ఈ పండులో ఉన్నాయి.
- ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది.
- పనస పండు అనీమియాను దూరం చేస్తుంది.
- పనసలోని విటమిన్-A మెదడు నరాలను బలపరుస్తుంది.
పనస అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.- పనస కంటి దృష్టిని మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
- వీర్యవృద్ధికి పనస పండు సహకరిస్తుంది.
- వాత, పిత్త వ్యాధులు నయమవుతాయి.
- పనసలోని ఫైబర్ పైల్స్ను నివారిస్తుంది.
- పనస లేత తొనల్ని వేయించి తీసుకుంటే పిత్తం తొలగిపోతుంది.
- ఏదైనా సరే మితంగా తినాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా ఈ పండును తింటే కొత్త సమస్యలు వస్తాయి.
పనస పండు నుంచి వచ్చే రబ్బరు పాల వల్ల అలర్జీకి గురయ్యే అవకాశం ఉంది.- రక్త సమస్యలు ఉన్నవారు పనస పండ్లను తీసుకోకపోవడమే ఉత్తమం.
- శస్త్ర చికిత్స పొందినవాళ్లు, అధికంగా ఔషదాలు తీసుకొనేవాళ్లు పనస పండ్లను తక్కువగా తీసుకోవాలి.
- పనస గింజల్లో ఉండే లెక్టిన్లు రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తాయి. అయితే, రోగ నిరోధక శక్తి చికిత్స పొందె రోగులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.