మట్టి ప్రమిదలు వెలిగించడం వెనుక ఆరోగ్య రహస్యాలు

దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. దీప + ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం ఐశ్వర్యం అయితే అంధకారం దారిద్ర్యం. దరిద్రాన్ని పారద్రోలి, ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే దీపావళి పండుగ ముఖ్యోద్దేశ్యం. దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి. దీపాన్ని వెలిగించి ఎర్రని అక్షింతలు లేదా ఎర్రని పూలు దీపం ముందర పెడితే శుభప్రదం. అలాగే నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం ద్వారా వచ్చే దీపపు కాంతి కంటికి ఎంతో మేలు చేస్తాయి.

మట్టి ప్రమిదలుదీపం అనేది త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీమహావిష్ణువుకి.., తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. ఈ కాంతి కళ్ళ మీద పడడం వలన కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. అదీకాక దీపావళి చలికాలంలో వస్తుంది.. సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. చల్లని వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయి. తద్వారా శ్వాసకు సంబంధించిన రోగాలు వస్తాయి. కానీ ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుందని.. ఆ వత్తులు కాలడం ద్వారా వచ్చే వాసనను పీల్చడం ద్వారా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దీపావళిఅయితే దీపావళి రోజున కొవ్వొత్తులను వాడకూడదు. ఇవి నెగెటివ్‌ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తిని.. దుష్టశక్తులను ఆకర్షిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. మార్కెట్లో దీపావళికి ప్రత్యేకంగా అమ్మే మైనపు వత్తుల్ని దీపాలుగా వెలిగించకూడదని వారు సూచిస్తున్నారు. దీపావళి రోజున ఎర్రటి ప్రమిదలు.. అదీ మట్టి ప్రమిదలను వాడటం ద్వారా దైవశక్తులను ఆకర్షించినవారవుతారు. దీపం శుభాలను సూచిస్తే.. కొవ్వొత్తి శోకాన్ని సూచిస్తుందని వారు గుర్తు చేస్తున్నారు.

దీపావళిమట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. అందులో నువ్వులనూనె పూర్వ జన్మల పాపపుణ్యాలను సూచిస్తుంది. అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు. దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను, అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చేసి, పరమాత్ముడిని చేరుస్తుంది దీపం వెనుకున్న పరమార్థమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మార్కెట్లో దొరుకుతున్న క్యాండిల్స్‌ను ఉపయోగించకూడదు. మట్టి ప్రమిదలను వాడండి, ఇవి ఆరోగ్య లక్ష్మీతో పాటు ఐశ్వర్య లక్ష్మీని అనుగ్రహిస్తాయి.

దీపావళిఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే…ఏ దీపమైనా మూడువత్తులు వేసి వెలిగించాలిగానీ.. ఒంటి దీపం, రెండు వత్తుల దీపాలు వెలిగించరాదు. మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి లక్ష్మీనిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని భక్తిగా శ్రద్ధగా వెలిగించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR