సమయానికి తిన్నా తినకపోయినా సరిపోయేంత నిద్ర లేకపోతే శరీరం నీరసించిపోతుంది. ఆరోగ్య కారణాలు, ఆర్థిక పరిస్థితులు, వర్క్ టెన్షన్, కుటుంబ పరిస్థితులు అన్నీ వెరసి నేటి జనరేషన్ కి నిద్రని దూరం చేస్తున్నాయి. సతమతం చేసే అనేక ఆలోచనల కారణంగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. పడుకున్న వెంటనే నిద్రపోవచ్చు.
ప్రతి రోజూ రాత్రి గోరు వెచ్చని పాలను తాగినా నిద్ర బాగా పడుతుంది. ఇది ఎంతో కాలం నుంచి పెద్దలు మనకు చెబుతూ వస్తున్నదే. పాలలో న్యూరో ట్రాన్స్మీటర్స్ ఉంటాయి. ఇవి చక్కని నిద్ర వచ్చేలా చేస్తాయి. మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి.