Home Unknown facts హనుమంతుడిని పూజించని ఊరు ఎక్కడ ఉందొ తెలుసా ?

హనుమంతుడిని పూజించని ఊరు ఎక్కడ ఉందొ తెలుసా ?

0

సాధారణంగా భారతదేశంలో హనుమంతుడికి ఊరికో ఆలయం ఉంటుంది.. ఎక్కడ చూసినా ఆంజనేయుని అమిత భక్తి శ్రద్దలతో కొలుస్తుంటారు..  దుష్టశక్తుల బారి నుండి కాపాడటానికి … బలం చేకూర్చటానికి ఆంజనేయుడిని పూజిస్తాము కానీ ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో హనుమంతుడిని పూజించారు సరికదా, పేరు ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఆ ఊరిలో ఎవరికీ ఆంజనేయుడని, హనుమంతుడని, మారుతి అని పేర్లు కూడా పెట్టరు..పొరపాటున కూడా హనుమంతుని తలవారు ఆ ఊరి ప్రజలు.. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఎందుకు ఆ గ్రామ ప్రజలు ఇలాంటి ఆచారాన్ని పాటిస్తున్నారు తెలుసుకుందాం..

Hanumanహనుమంతుని వెలేసిన ఆ ఊరి పేరు ద్రోణగిరి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది..  దేశ రాజధాని అయినా ఢిల్లీ నుండి 400 కిలోమీటర్ల దూరంలో, 6 గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ఈ ద్రోణగిరి. దీన్నీ దునగిరి, దూణగిరి అని కూడా అంటారు… ఈ గ్రామం సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కుమవొన్ పర్వత శ్రేణులలో ఉంది. ఈ ద్రోణగిరి లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం ఉంది. గుడిలో కొలువైన దేవతను ‘దునగిరి దేవి’ గా కొలుస్తారు ఇక్కడి ప్రజలు…

పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండ పై తపస్సు చేశాడు కనుకనే ద్రోణగిరి అన్న పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. పాండవులు వనవాస సమయంలో కొద్దీ రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు. దున గిరి దేవి ని మహామయ హరిప్రియ గా అభివర్ణిస్తారు. ఈ శక్తి పీఠానికి గల మరో పేరు ‘ఉగ్ర పీఠ’.

ఈ ద్రోణగిరి లో ప్రజలు ఆంజనేయ స్వామి ని పూజించరు సరి కదా..  ద్వేషిస్తారు. అంత పాపం ఈ ఊరికి ఆంజనేయస్వామి ఏమి చేసాడు అంటే.. పూర్వము రామాయణ కాలంలో  అంటే త్రేతాయుగం లో  రాముడు – రావణాసురుడు మధ్య యుద్ధం జరుగుతుంది.. ఆ  సమయంలో లక్ష్మణుడు  స్పృహ తప్పి కింద పడిపోతాడు..  అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయా పర్వతాల వద్ద ఉన్న సంజీవని పర్వతం తీసుకొని వచ్చి మరీ లక్ష్మణుడిని మూర్ఛ నుండి తప్పిస్తాడు.. అయితే హనుమంతుడు అలా ఎత్తుకొచ్చిన  సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్ళేసరికి ఇక్కడున్నవారికి కోపం కట్టలు తెగిందట.

అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పూజలు చేయటం మానేశారు ఈ  గ్రామ ప్రజలు. ఆ కారణంతో ఇప్పటికి హనుమంతుడి ని ద్వేషిస్తారు ఇక్కడి ప్రజలు..

Exit mobile version