జోతిర్లింగాలలో ఏ లింగాన్ని దర్శిస్తే ఎటువంటి ఫలాలు పొందుతారో తెలుసా ?

శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా, తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం. ఈ పన్నెండు జోతిర్లింగాలలో ఏ లింగాన్ని దర్శిస్తే ఎటువంటి ఫలాలు పొందుతాం అనే విషయాన్ని పరిశీలిద్దాం…

సోమనాథ జోతిర్లింగం :

జ్యోతిర్లింగంసౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, ఆయన పేరుతోనే అలరారుతున్న కుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

శ్రీశైల జోతిర్లింగం :

జ్యోతిర్లింగంఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వల్ల సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, అన్ని విధాలా శుభాలు ఏర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

ఉజ్జయిని :

జ్యోతిర్లింగంఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చ వల్ల భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం సాధిస్తారు.

ఓంకారేశ్వరం :

జ్యోతిర్లింగంఅమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వరంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

కేధారేశ్వరం :

జ్యోతిర్లింగంశ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుంది. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలను నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.

భీమశంకరలింగం :

జ్యోతిర్లింగంఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన అన్ని విధాల భయాలు అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.

కాశీ విశ్వేశ్వరలింగం :

కాశీ విశ్వేశ్వరలింగంసర్వప్రపంచం చేత సేవించ బడుతున్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన మాత్రం చేతనే సమస్తమైన కర్మబంధాల నుంచి విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

త్రయంబకేశ్వర లింగం :

జ్యోతిర్లింగంమహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వల్ల అన్ని కోరికలు తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

వైద్యనాథ జ్యోతిర్లింగం :

జ్యోతిర్లింగంచితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వల్ల భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

నాగేశ్వర జ్యోతిర్లింగం :

జ్యోతిర్లింగంనాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనం మరియు అర్చనాదుల వల్ల సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

రామేశ్వర జ్యోతిర్లింగం :

జ్యోతిర్లింగంశ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.

ఘృష్ణేశ్వరుడు :

జ్యోతిర్లింగంఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల కోరికలను తీరుస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR