కొండ గుహల్లో వెలసిన మల్లన్న ఆలయం ఎక్కడ ఉంది?

పరమశివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే ఎన్నో ప్రసిద్ద శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు ఒక కొండ గుహలో మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. మరి కొండ గుహల్లో వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ శివుడు ఎలా వెలిశాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mallanna Swamy

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, జైపూర్ మండలం లో మల్లన్న గుడి ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో చేసే జాతర సమయంలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Mallanna Swamy

ఇక పురాణానికి వస్తే, ఈ గ్రామానికి చెందిన ఒక బాలుడు ప్రతి రోజు తన పశువులను కాసేందుకు గుట్టపైకి వచ్చి పశువులను మేపుతూ ఉండేవాడు. ఇక ఆ బాలుడు మల్లన్న స్వామి అని పిలిస్తే పలికేవాడని, తన పశువులు కూడా ఎక్కడకి వెళ్లకుండా అక్కడే మేస్తూ ఉండటంతో ఒకసారి అక్కడికి వచ్చిన తోటి కాపరులు మల్లన్న ని చూసి దూషించడంతో ఆ బాలుడు మాయం అవ్వడంతో అప్పటినుండి ఆ గుహలో ఉన్న శివలింగాన్ని పూజించడం ప్రారంభించారని పురాణం.

Mallanna Swamy

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ గుహలో ఏ కాలం లో అయినా శుద్ధ జలం ఉంటుందని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. ఇలా వెలసిన ఆ శివుడిని కొండల్లో ఉన్న మల్లన్న, కోటి దండాలు నీకన్నా అంటూ భక్తులు తరిస్తారు. అయితే శివరాత్రి కి పది రోజుల ముందు నుండే భక్తులు ఈ ఆలయానికి వచ్చి చేరుకుంటారు.

Mallanna Swamy

అయితే శివరాత్రి రోజున మల్లన్న గుడితో పాటు సమీపంలో గుట్టపై ఉన్న గట్టు మల్లన్న దేవాలయాలు కూడా జాతరకు సిద్ధం అవుతాయి. జాతరలో భాగంగా భక్తులు బోనాలు పోసి, పట్నాలు వేసి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ సమయంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడి తరలి వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR