కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన ప్రదేశం తిరుమల. ఎంతో పవిత్రమైన ఈ క్షేత్రాన్ని రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ ఏడుకొండలు ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలని అంటారు. అయితే తిరుపతికి వెళ్ళే స్థోమత లేనివారు ద్వారకా తిరుమలలో మొక్కులను చెల్లించవచ్చట. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కి 42 కి.మీ దూరంలో గల ద్వారకా తిరుమల ఎంతో పవిత్ర పుణ్య క్షేత్రం.
ద్వారకా మునికి ప్రత్యక్షమైన విరాట్టు వక్ష స్థలం వరకు మాత్రమే దర్శనమిస్తుంది. స్వామి పాదాలు పాతాళంలో ఉన్నాయి అని నమ్మిక. అందుకే శ్రీ రామానుజాచార్యుల వారు స్వామిని దర్శించుకున్నపుడు స్వామి వారి పెద్ద విరాట్టు చేశారు. మహర్షికి దర్శనము ఇచ్చిన విరాట్టుని మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని, ప్రతిష్ట చేసిన విరాట్టుని కొలిస్తే ధర్మార్త మొక్షాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం.