కొన్ని పురాణాల్లో పతివ్రతలు గురించి గొప్పగా చెప్పారు. అందులో మనకు ఎక్కువగా వినపడే పేరు సుమతి. ఆమె కథ తెలుసుకుందాం. పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు. అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలది. వాడు నిత్యం బయట తిరుగుతూ, ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యమోహం కలిగి ఉండేవాడు. దానికి విరుద్ధంగా సుమతీ మహాపతివ్రత. కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగుళ్లు తిరగడంతో కుష్టురోగం తెచ్చుకుంటాడు. అయినప్పటికీ సుమతి మాత్రం అతనిని వదలకుండా దైవంలాగే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంటుంది.