శివభక్తుడు నిర్మించిన నవ బ్రహ్మేశ్వరాలయాల గురించి తెలుసా?

0
2775

ఒక శివభక్తుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న స్వయంభువు లింగాన్ని పూజించి ఒక రాత్రి నిద్రించగా ఆ రాత్రి కలలో ఇది మాములు క్షేత్రం కాదని దేవతలకి నిలయం అని గ్రహించి తన మదిలో ఉన్న ఎప్పటినుండి ఉన్న నవబ్రహామేశ్వరాలయాలు నిర్మించాలనే సంకల్పాన్ని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ అధ్బుతమైన నవ బ్రహ్మేశ్వరాలయాలు నిర్మించాడు. మరి ఆ శివభక్తుడు ఎవరు? దేవతలకి నిలయమైన ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 devathalaki nilayamaina nava brahmeshwaralayalu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా, సిద్దవటం గ్రామంలో అతి పురాతనమైన సిద్దేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ సిద్దేశ్వరస్వామి స్వయంభువు లింగం. అయితే ఇక్కడ కొలువై ఉన్న ఈ స్వామిని సిద్దులు పూజించడం వలన ఈ స్వామి సిద్దేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచాడు. అందుకే ఈ ప్రాంతానికి కూడా సిద్దేశ్వరం అనే పేరు వచ్చినది అని చెబుతారు.

దాదాపుగా క్రీస్తుశకము 658 వ సంవత్సరంలో చాళుక్య వంశీయుడు మొదటి విక్రమాదిత్యుడు ఉండేవాడు. ఈయన ఒక గొప్ప శివభక్తుడు. ఈయన దక్షిదేశ తీర్థయాత్రలకు బయలుదేరి సిద్దవటం చేరి సిద్ధులచే పూజించబడిన స్వయంభువు శివలింగమైన సిద్దేశ్వరస్వామిని పూజించి ఆ రాత్రి అచట బస చేసాడు. ఆ రాత్రి అయన స్వప్నంలో తాను నిద్రించిన స్థలం గొప్ప ప్రశస్తమైనదిగా, అది దేవతలకి నిలయంగా కన్పించి అంతరార్థమైనది.

2 devathalaki nilayamaina nava brahmeshwaralayalu

ఇక నిద్రలో నుండి మేల్కొన్న ఆ రాజు ఇంతటి పవిత్రమైన స్థలంలో తనకి ఎప్పటి నుండో మనసులో నవ బ్రహ్మేశ్వరాలయాలు నిర్మించాలనే సంకల్పాన్ని ఇక్కడే నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. ఈవిధంగా ఇక్కడ నవ బ్రహ్మేశ్వరాలయాలు నిర్మించబడ్డాయి.

3 devathalaki nilayamaina nava brahmeshwaralayalu

నవ బ్రహ్మేశ్వరాలయాలు వరుసగా బాలబ్రహ్మెశ్వరాలయం, కుమార బ్రహ్మెశ్వరాలయం, అర్కబ్రహ్మెశ్వరాలయం, వీరబ్రహ్మేశ్వరాలయం, తారక బ్రహ్మేశ్వరాలయం, గరుడ బ్రహ్మేశ్వరాలయం, స్వర్గ బ్రహ్మేశ్వరాలయం, విశ్వ బ్రహ్మేశ్వరాలయం, పద్మ బ్రహ్మేశ్వరాలయాలు. ఈ ఆలయాల యొక్క వాస్తు విధానం బాదామి చాళుక్యుల నాటి హిందూ సాంప్రదాయ వాస్తుకు చెందినది.

4 devathalaki nilayamaina nava brahmeshwaralayalu

ఈ తొమ్మిది ఆలయాలలో ప్రధాన దైవం శివలింగాలు. ఇవి అన్ని కూడా నల్లని స్పటిక లింగాలు. ఇక్కడ అధిష్టాన దైవం బాలబ్రహ్మేశ్వరుడు. ఈ ఆలయాల గర్భగుడి నలుచదరముగాను, మధ్యలో బలమైన పీఠంపై శివలింగం ప్రతిష్టింపబడి ఉంది. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.

5 devathalaki nilayamaina nava brahmeshwaralayalu

ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో, శివరాత్రి రోజున సిద్దేశ్వరస్వామి వారికీ, నవ బ్రహ్మేశ్వరాలయాలలో ఉన్న శివలింగాలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న రంగనాయకుల స్వామివారికి జేష్ఠ శుద్ధి పూర్ణిమనాడు అతి వైభవంగా గరుడోత్సవం జరుపుతారు. ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శిస్తారు.

6 devathalaki nilayamaina nava brahmeshwaralayalu