Home People Lata Mangeshkar, The Nightingale Of India Is No More But Her Voice...

Lata Mangeshkar, The Nightingale Of India Is No More But Her Voice Will Stay With Us Forever

0
latha ji

కళాకారులు వెళ్లిపోవచ్చు కానీ వారి కళ మాత్రం ఈ భూమి ఊపిరి తీసుకునే అంత వరకు మన అందరికి ఊపిరి పోస్తూనే ఉంటుంది. లతా మంగేష్కర్ గారి పాటలు మనతోనే ఎప్పటికి ఉంటాయి.

ఆమె ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు. భారతదేశం మొత్తానికి లతా మంగేష్కర్ గారి సుపరిచితమే. తన కెరీర్‌లో 20 భారతీయ భాషల్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు. వాటిలో అధికంగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కేవలం మూడే మూడు పాటలు పాడారు.

1955లో ఏఎన్నార్, సావిత్రి నటించన , ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ లతాజీ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిన ‘దొరికితే దొంగలు’ సినిమాలో ‘శ్రీ వేంకటేశా..’ అనే గీతాన్ని ఆలపించారు , చివరి సారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటను పాడారు.

2009లో వచ్చిన ‘జైల్’ సినిమాలోని ‘డాటా సున్ లే’ అనే పాటతో తన సినీ సింగింగ్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారామె. ఆ తర్వాత అన్నీ భక్తి పాటలే పాడారు.

ఆమె అద్భుతమైన గానంకి భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో లతాజీను సత్కరించింది.

ఇవాళ ఆమె మధ్య లేకున్నా ఆమె పాడిన పాటలు మనతోనే ఉంటాయి. ఆ పాటలని వింటూ సంగీతం, స్వరం అమరం అని గుర్తుచేసుకుందాం రండి

1. Aye Mere Watan Ke Logo

2. Humko Humise Chura

3. Kabhi Khushi Kabhi Gham

4. Jo Wada Kiya

5. Dil To Pagal Hai

6. Didi Tera Dewar Deewana

7. Jiya Jale

8. Ye Kahan Aa Gaye hum

9. Vande Matram

10. Koi Ayega

Lataji Telugu songs

– Nidurapora Thammuda

– Tirupathivaasa Sreevenkatesaa

– Thella Cheeraku

Exit mobile version