కళాకారులు వెళ్లిపోవచ్చు కానీ వారి కళ మాత్రం ఈ భూమి ఊపిరి తీసుకునే అంత వరకు మన అందరికి ఊపిరి పోస్తూనే ఉంటుంది. లతా మంగేష్కర్ గారి పాటలు మనతోనే ఎప్పటికి ఉంటాయి.
ఆమె ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు. భారతదేశం మొత్తానికి లతా మంగేష్కర్ గారి సుపరిచితమే. తన కెరీర్లో 20 భారతీయ భాషల్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు. వాటిలో అధికంగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కేవలం మూడే మూడు పాటలు పాడారు.
1955లో ఏఎన్నార్, సావిత్రి నటించన , ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ లతాజీ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిన ‘దొరికితే దొంగలు’ సినిమాలో ‘శ్రీ వేంకటేశా..’ అనే గీతాన్ని ఆలపించారు , చివరి సారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటను పాడారు.
2009లో వచ్చిన ‘జైల్’ సినిమాలోని ‘డాటా సున్ లే’ అనే పాటతో తన సినీ సింగింగ్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టేశారామె. ఆ తర్వాత అన్నీ భక్తి పాటలే పాడారు.
ఆమె అద్భుతమైన గానంకి భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో లతాజీను సత్కరించింది.
ఇవాళ ఆమె మధ్య లేకున్నా ఆమె పాడిన పాటలు మనతోనే ఉంటాయి. ఆ పాటలని వింటూ సంగీతం, స్వరం అమరం అని గుర్తుచేసుకుందాం రండి