మహాభారతంలో ముఖ్యమైన ఒక పాత్ర అర్జునుడు. తన భక్తితో, ధైర్య సాహసాలతో అందరి మన్ననలు, ప్రశంసలు, విలువిద్యలు, అస్త్రాలు పొందాడు. సాక్షాత్తు పరమశివుడి దగ్గర నుండి పాశుపతాస్త్రం పొందాడు. అయితే అది అంత సులువుగా పొందలేదు. పాశుపతాస్త్రం ఇవ్వడానికి శివుడు అర్జునుడికి పెట్టిన పరీక్ష గురించి తెలుసుకుందాం…
దీంతో మీ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేసిన శివుడు.. పార్వతిపైపు తిరిగి నువ్వు ఏదో సందేహంతో ఉన్నట్టున్నావు.. అదేంటో అడుగు అంటూ ప్రశ్నించాడు. శివుడి ప్రశ్న విన్న పార్వతి స్పందిస్తూ.. ఆయధ శక్తి కోసం అర్జునుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నువ్వు అర్జునుడికి ఆ శక్తిని ప్రసాదిస్తే… అతడు ఆ శక్తిని దేని కోసం ఉపయోగిస్తాడోనని సందేహం వ్యక్తంచేసింది పార్వతి.
పార్వతి ప్రశ్నకు తన చూపుతోనే సమాధానం ఇచ్చిన శివుడు… మనం మారువేషంలో వెళ్లి అతడి వైఖరిని పరీక్షిద్దాం అని బయల్దేరుతారు. శివుడు కోయ దొరలాగా వెళ్లగా.. పార్వతి అదే కొండ జాతికి చెందిన స్త్రీ రూపంలో బయల్దేరారు. కైలాసంలోని తమ సేవకులను కొండ జాతికే చెందిన స్త్రీలుగా మార్చి వారిని తమ వెంట తీసుకుని వెళ్తారు .
మునీశ్వరుల తపస్సును భగ్నం చేయడానికే ఇలా పంది రూపంలో వచ్చాడని శివుడు పార్వతికి చెబుతాడు. వెంటనే తన బాణాన్ని ఎత్తి పందికి గురిచూసి కొట్టబోగా… శివుడిని గమనించిన అసురుడు అక్కడి నుంచి అర్జునుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి పరుగెత్తుతాడు. అడవి పంది రాక చూసిన మునీశ్వరులు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెత్తగా.. అర్జునుడు మాత్రం తన విల్లును ఎత్తి అడవి పంది వైపు గురిపెడతాడు.
అలా అడవి పంది రూపంలో ఉన్న అసురుడిపైకి ఇద్దరూ బాణాలు సంధించగా.. ఆ అడవి పంది ప్రాణాలు వదులుతుంది. అయితే అక్కడే అసలు సమస్య తలెత్తుతుంది. తన బాణం వల్లే అడవి పంది చనిపోయింది అంటే.. తన బాణం వల్లే అంటూ ఇద్దరూ వాగ్వీవాదానికి దిగుతారు. దీంతో మరోసారి అర్జునుడు శివుడి రూపంలో ఉన్న కోయ దొరకు సవాలు విసురుతాడు. ఈసారి మనం ఇద్దరం పోటీపడదామని.. ఎవరు గెలిస్తే వారి వల్లే ఆ అడవి పంది చనిపోయినట్టు భావించాల్సి ఉంటుందని అర్జునుడు సవాలు విసురుతాడు.
తాను ఏదో తెలియని శక్తిని పొందినట్టు గుర్తించిన అర్జునుడు.. వెంటనే తపస్సు మీద నుంచి లేచి మునుపటి కంటే మరింత పౌరుషంతో ఆ కోయ దొర మీదికి వెళ్తాడు. తనకు శివుడు మహాశక్తిని ప్రసాదించాడని, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నాతో తలపడు అని సవాలు విసురుతూ కోయ దొరను సమీపిస్తాడు. కానీ అంతలోనే ఆ కోయ దొర మెడలో శివలింగం వేలాడటం గమనించిన అర్జునుడు వెంటనే తన తప్పు తెలుసుకుని అసలు నిజాన్ని గ్రహిస్తాడు. తనకు తెలియకుండానే తాను ఆ మహా శివుడితో యుద్ధానికి దిగానని గ్రహించి సిగ్గుపడుతాడు. శివుడి ముందు మొకరిల్లి జరిగిన తప్పిదానికి తనను క్షమించాల్సిందిగా వేడుకుంటాడు.
ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో కర్ణుడిపై అదే పాశుపతాస్త్రం ప్రయోగించి అర్జునుడు విజయం సాధిస్తాడు.