అతడి రూపం నల్లటిది. కాని మనసు మాత్రం మరుమల్లె కన్న తెల్లనిది, పరిమళభరితమైనది, స్వచ్ఛమైనది. బాల్యం నుంచి – ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎన్ని సవాళ్లను అధిగమించాడు? కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు. స్వంత మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించని, దేనికీ భయపడని, ఎవరికీ లొంగని ఆ ధీరోదాత్తుడే శ్రీకృష్ణుడు. కార్యసాధన అంటే ఏమిటో ఆచరించి చూపిన సిసలైన కార్యసాధకుడు, శరణన్న వారికి రక్షణగా నిలిచిన అసలైన రక్షకుడు, మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీసివేయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపిన అసహాయ శూరుడు శ్రీకృష్ణుడు.
కానీ ఒక ఆలయంలో మాత్రం మొహం పై గాయాలతో ఉన్నటువంటి శ్రీ కృష్ణుడు మనకు దర్శనం కల్పిస్తాడు.
మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? శ్రీకృష్ణుడు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ఈ క్రమంలోనే కురుక్షేత్ర సంగ్రామంలో ఎటువంటి ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం అనేది ఉండదు. కేవలం స్వామి వారి చేతిలో శంఖం మాత్రమే ఉంటుంది.
ఈ ఆలయంలో వేరుశెనగ నూనె, మిరపకాయలు నిషిద్ధం.ఈ ఆలయంలో కొలువై ఉన్న పార్థసారథి విగ్రహానికి, వెంకటేశ్వరుని విగ్రహానికి వేరువేరుగా ధ్వజస్తంభాలు ఉన్నాయి.