మాస్క్ ఎక్కువగా వాడితే దంత సమస్యలు తప్పవు!

కరోనా మహమ్మారి తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. మనం కలలో కూడా ఊహించని పనులెన్నో చేయించింది. మనిషిని నాలుగు గోడల మధ్య బంధించింది. మహమ్మారి నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. కానీ ఈ మాస్క్ తో కూడా ముప్పు ఉందంటున్నారు వైద్యులు. కాకపోతే అది కరోనా ముప్పు కాదు. గంటలకొద్దీ మాస్క్ అలాగే ఉంచుకుంటే దంత సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు.

6-Mana-Aarogyam-787కరోనా సెకండ్ వేవ్ తగ్గాక డెంటిస్ట్ ల వద్ద క్యూలు కూడా ఇది నిజమనే చెబుతున్నాయి. చాలాసేపు మాస్కు ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఇది పరోక్షంగా గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్‌ సమస్యలకు కారణమవుతోందని దంత వైద్య నిపుణలు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణకు గంటల తరబడి మాస్కు వాడుతున్నారా… ఇలా చేయడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోయి పళ్లు, చిగుళ్ల వంటి వాటిపై సూక్ష్మక్రిములు ప్రభావం చూపుతున్నట్టు వైద్యుల పరిశీలనలో తేలింది.

3-Mana-Aarogyam-787ప్రతి వ్యక్తి నోట్లో రోజూ లీటరు లాలాజలం ఉత్పత్తవుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నోటిని శుభ్రపర్చడానికి, పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని శుభ్రం చేయడానికి ఇది దోహదపడుతుంది. తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడే అమైలేజ్‌ ఎంజైమ్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. కడుపులో గ్యాస్‌ను నియంత్రిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న లాలాజలం చాలా మందిలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి కావడంలేదు. కారణం.. విరామం లేకుండా మాస్కు వాడడమే.

4-Mana-Aarogyam-787ఇటీవల ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. పైగా ఇటీవల చాలా మంది రెండు మాస్కులను ఉపయోగిస్తున్నారు. ఇది గాలిని సరిగా పీల్చలేని పరిస్థితికి దారితీస్తుంది. కొందరు ఎన్‌95 మాస్కు వాడుతూనే దాని కింద మూడు పొరలు ఉన్న మరో మాస్కును వాడుతున్నారు. దీంతో బయట గాలి అంతగా లోపలికి చొరబడదు. అడపాదడపా నోటి ద్వారానూ శ్వాస తీసుకుంటున్నారు. దీంతో నోరు ఎండిపోతోంది. ఫలితంగా నోట్లోని సూక్ష్మక్రిములు బలపడుతున్నాయి. అప్పటికే కొద్దిగా పుచ్చిన పళ్లపై ఇవి ప్రభావం చూపుతున్నాయి. చిగుళ్లు ఉబ్బడం, రక్తం కారడంతోపాటు నోట్లో దుర్వాసన ప్రారంభమవుతోంది.

నిజానికి 6 నెలలకోసారి దంతాలను క్లీన్‌ చేయించుకోవాలి. లేదంటే పళ్ల చుట్టూ పాచీ పేరుకుపోయి వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు నిలయంగా మారుతుంది. దంతాల మధ్యలో పాచీ పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు తలెత్తి దంతాలు పటుత్వాన్ని కోల్పోతాయి. రోజంతా మాస్కు ధరించడ వల్ల మంచినీరు తక్కువగా తీసుకుంటున్నారు. దీంతో నోరు ఎండిపోతుంటుంది.

3-Mana-Aarogyam-787ఆ తర్వాత దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధికి ఇది కారణమవుతుంది. నోటిలోని బ్యాక్టీరియా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు కారణం అవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుంది. మధుమేహం రోగుల్లో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. చాలా వరకు వీరి దంతాలు దెబ్బతింటున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది.

ఇక అప్పటికే దంత వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే పరిస్థితి తీవ్రమవుతోందని వైద్యుల పరిశీలనలో తేలింది. చిగుళ్ల వ్యాధులు ఉంటే సైటోకైన్‌ అనే కెమికల్‌ రియాక్షన్‌ జరిగి గొంతుపై ఉండే పైపొరపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ సోకగానే ఆ వైరస్‌ నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది. దాంతో కరోనా ఎఫెక్ట్ త్వరగా శరీరంపై చూపెడుతుంది. అందువల్ల మాస్కులు గంటల తరబడి వాడేవారు కొన్ని మెలకువలు పాటించాలని సూచిస్తున్నారు.

7-Mana-Aarogyam-787చుట్టూ ఎవరూ లేనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు కొద్దిసేపు మాస్కు తీసినా ఇబ్బంది ఉండదు. తద్వారా బయట గాలి పీల్చుకోవడమే కాకుండా లాలాజల ఉత్పత్తికి దోహదపడుతుంది. డైలీ సరిపడా నీరు తాగుతూ నోరు ఎండిపోకుండా చూసుకోవాలి. నోరు తడి ఆరిపోతుందని అనిపిస్తే వెంటనే మంచినీళ్లు తాగడం మంచిది. డైలీ ఉదయం, సాయంత్రం రెండుసార్లు కచ్చితంగా బ్రష్ చేస్తే తాజాదనంతో పాటు దంతాలు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి.

2-Mana-Aarogyam-787

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR