భక్తుడిని రక్షించడం కోసం జ్యోతి రూపంలో వెలిసిన స్వామి

0
976

భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా ఒక్కక్క దేవాలయం నిర్మాణం, ఆ దేవాలయంలోని మూలవిరాట్టు కు ప్రత్యేక పురాణ కథలు కూడా ఉంటాయి. అటువంటి కోవకు చెందినదే నాగేశ్వర జ్యోతిర్లింగం. ఓ సాధారణ భక్తుడిని రక్షించడానికి జ్యోతి రూపంలో వెలిశాడని చెబుతారు.

దీన్ని బట్టి ఆ పరమశివుడు తనను నమ్మినవారితో సదా వెన్నంటి ఉంటాడన్న విషయం స్పష్టమవుతోంది. ఇక ఈ జ్యోతిర్లింగం మోక్ష నగరాల్లో కొలువై ఉండటం గమనార్హం. అందువల్లే ఈ జ్యోతిర్లింగం మిగిలిన జ్యోతిర్లింగాలతో పోలిస్తే విశిష్టమైనదిగా భారతీయ పురాణాలు చెబుతాయి.

నాగ నాదేశ్వర జ్యోతిర్లింగఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎంతో విశీష్టమైన ముఖ్యమైన శ్రీ నాగ నాదేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ప్రభాస రైల్వే స్టేషన్ కు దగ్గర్లో శ్రీ నాగ నాదేశ్వర జ్యోతిర్లింగం ఉంది. పాండవులు వనవాసం చేసే సమయంలో దారుకా వనంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణ గాథ. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు హిందూ దేవాలయాలు అన్ని కూల్చి వేస్తున్న సమయంలో ఈ క్షేత్రం వద్దకు రాగానే శరీరం నిండా పాములు, చేతిలో త్రిశూలం పట్టుకున్న నగ్న కాపాలికులు ఔరంగజేబుని, అతని సేనలను తరిమి కొట్టినట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి.

నాగ నాదేశ్వర జ్యోతిర్లింగoఇంకా ఇలాంటి నాగ నాదేశ్వర దేవాలయాలు మూడు చోట్ల ప్రసిద్ది చెందిన క్షేత్రాలుగా ఉన్నాయి. శివుని మెడలో ఉండే నాగరాజు యొక్క స్వరూపంగా ఈ ఆలయానికి పేరు. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం.