పంచశైవక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన పట్టిసాచల క్షేత్రం దశాబ్దాల తరబడి శివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. పవిత్ర గోదావరరి నదిలో పుణ్యస్నానాలు చేసి శివాలయంలో పూజలు జరిపితే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. మరి వీరభద్రుడు అక్కడ ఎలా వెలిసాడు? ఆ పర్వతం ఎక్కడ ఉందనే మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవట. అలా ఆకాశంలో ఎగురుతూ, సేద తీరేందుకు ఓ చోట ఆగేవట. సేదదీరేందుకు అవి భూమిపై దిగే సమయంలో అక్కడ ఉన్న జనజీవనం మొత్తం నాశనమయిపోయేది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు ఆ పర్వతాల రెక్కలను ఖండించాడు. దీంతో ఆ పర్వతాలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పర్వతాలనే దేవ కూటాద్రి పర్వతాలు లేక నీలాద్రి పర్వతాలు అని పిలుస్తుంటారు.