సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసిన వాడు, రామ లక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేసినవాడు, నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు.
ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి వాయుసుతుడని పేరు.
అయితే ఆంజనేయ స్వామికి నిజంగానే వివాహం అయిందా. అయితే ఎవరితో అయిందో వివరంగా తెలుసుకుందాం.
సూర్య భగవానుడు సువర్చలాదేవి వివాహం కోసం ఆమె తేజస్సును తట్టుకోగలిగిన వరుని కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఆమె తేజస్సును తట్టుకొనే వరుడు ఎక్కడ దొరక్క సువర్చలా వివాహానికి మార్గం చూపమని బ్రహ్మ దేవుణ్ణి ప్రార్థించగా, అప్పుడు బ్రహ దేవుడు వాయునందనుడు, మహా పరాక్రమశాలి, ప్రచండ తేజో మూర్తి అయిన ఆంజనేయుడే సువర్చలకు తగిన వరుడని చెబుతాడు. వెంటనే సూర్యుడు ఆంజనేయడి దగ్గరకు వెళ్లి తన కూతురిని వివాహం చేసుకోమని అడుగుతాడు. ఆంజనేయుడు తన బ్రహ్మచర్య దీక్షను గురించి సూర్యునికి చెబుతాడు.
జ్యేష్ట శుద్ధ దశమి, ఆదివారం నాడు,ఉత్తరా నక్షత్ర యుక్త సింహ లగ్నంలో, ముప్ఫై రెండుకోట్ల దేవతల దీవెనలతో వివాహం జరిగింది.