పుత్ర సంతానం కోసం పరితపించేవారు ఈ వ్రతాన్ని చేస్తే పిల్లలు కలుగుతారు. గణపతి పురాణంలో పూర్వం కృతవీరుడు అనే ఒక మహారాజు సకల భోగ భాగ్యాలతో,సకల సిరి సంపదలతో మరియు అందమైన భార్యతో సంతోషంగా రాజ్యం ఏలుతుండేవాడు.ఎంత కాలమైన అతనికి సంతానం కలగలేదు.ఎన్ని పూజలు, హోమాలు, యజ్ఞాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా సంతానం కలుగలేదు. ఒకనొక రోజు నారదున్ని కలిసి తనకు సంతానం కలగడానికి తగిన ఉపాయం తెలపమని అడుగుతాడు.
నారదుడు తగిన తరుణోపాయం వెతుకుతూ కృత వీరుని పిత్రులోకాలకు వెళ్లి అక్కడ కృతవీరుని తండ్రి, తాత, ముత్తాతలు నరక భాదలు అనుభవిస్తూ ఉండడం చూసి కృత వీరుని తండ్రితో ఇలా అన్నాడు. భూలోకంలో నీ కుమారుడు సంతానం లేక త్రివమైన మనో వేదనను అనుబావిస్తునాడు. నీ కుమారునికి సంతానం కలగడానికి తగిన ఉపాయం తెలపమని నారదుడు అడుగుతాడు. అప్పడు కృత వీరుని తండ్రి నారుదునితో, నా కుమారున్ని మహాగణపతి యొక్క సంకష్ట్టి వ్రతం చేయమని, అలా వ్రతం చేస్తే తన కుమారినికి సంతానం కలగటమే కాకుండా, తనకు, తన తండ్రి, తాత ముత్తాతలకు నరకలోక భాదలనుండి విముక్తి లభిస్తుంది అని తెలుపుతాడు.
నారదుడు భూలోకం వెళ్లి కృతవీరునితో శ్రీ మహాగణపతి యొక్క సంకష్టి వ్రతం చేయమని, ఈ వ్రతం చేయమని నీ తండ్రి తెలిపాడు అని కృతవీరునితో అన్నాడు. అప్పడు కృత వీరుడు ఎంతో సంతోషించి ఈ వ్రతం ఎప్పుడు ఎలా చేయాలో తెలుపామని నారదుణ్ణి అడుగుతాడు.
ఈ వ్రతం శ్రావణ బహుళ చవితి రోజుగాని మాఘ బహుళ చవితి రోజు మంగళవారం నాడు చంద్రోదయం పూట తలస్నానం చేసి ఉపవాసం వుండి,సంకల్పం చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్నానం ముగించుకొని గణపతిని ప్రార్ధించాలి. అదర్వ శీర్షంతో గణపతిని అభిషేకించాలి. శ్రీ గణపతి మహామంత్రాన్ని జపించాలి. శ్రీ మహా గణపతికి బెల్లంతో చేసిన వంటకాలు, లడ్డులు, మోదకలు సమర్పించాలి. ముఖ్యంగా ఈ పూజలో తెల్ల జిల్లేడు పూలను,తుమ్మి పూలను పెట్టాలి అలాగే గరికను తప్పని సరిగా పెట్టాలి. గరికను పెట్టకపోతే వ్రతం నిష్పలం అవుతుంది అని నారదుడు కృతవీరుని తో అన్నాడు.
కృత వీరుడు ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం వరకు జరిపించి, సంతానం పొందాడు అని, అలాగే తన పితృ,తాత,ముత్తతలు నరకం నుంచి తప్పించాడని గణపతి పురాణంలోని ఈ ఒక కధ చెబుతుంది.