ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, శివుడు పార్వతీదేవి చేయిపట్టుకుని కొలువై ఉన్న విగ్రహమూర్తి కలదు. అయితే త్వరగా పెళ్లి జరగడం కోసం భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అంతేకాకుండా జాతకరీత్యా రాహుగ్రహ పీడ కలిగిన వారిని పూజలకు అనుమతిస్తారు. నవగ్రహ దేవతలలో ఒకరైన రాహువు ఇక్కడ లింగరూపుడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఆలయం చుట్టూ కందకాలు తవ్వబడి ఉన్నాయి. అందులోకి సప్తసాగరులలో ఉన్న నీరు చేరి పవిత్రమైన పుష్కరణిగా వెలిసిందని భక్తులు నమ్ముతారు.