శ్రీకృష్ణుడిని అమితంగా ఆదరించే మీరాబాయి గురించి ఆచ్చర్యకర నిజాలు

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదో అవతారమే కృష్ణుడు. కృష్ణుడు ఇతర హిందూ దేవతలకన్నా ఎంతో భిన్నం. మిగతావారు తమ ప్రత్యేక లక్షణాలు,శక్తులతో ప్రసిద్ధులు కానీ కృష్ణుడు అనేక కళలున్న వాడు. మరి రాజపుత్ర రాణి అయినటువంటి మీరాబాయికి శ్రీ కృష్ణుడు అంటే ఎందుకు అంత ఇష్టం? శ్రీకృష్ణుడిని అమితంగా ఆదరించే ఆమెకి చివరకు ఎం జరిగిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Krishnaరాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా మెర్టాలో బ్రాహ్మణ కుటుంబంలో 1498 సంవత్సరంలో మీరాబాయి జన్మించింది. మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సాధువుని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని ఘాడంగా మోహించింది, దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది. ఆమె తల్లి ఆమె ఆధ్యాత్మిక భావనలకు మద్ధతునిచ్చేది కానీ ఆమె త్వరగా చనిపోయారు.

Mirabaiమీరా వివాహం ఆమె చిన్న వయస్సులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజ్ రాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. కాని తనని తానూ శ్రీ కృష్ణుని భార్యగా భావించుకునే మీరాకు ఈ వివాహం సంతోషం కలిగించలేదు. ఆమె కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్ళి చేసుకున్నానన్న భావనలో ఉండేది. ఆమె తనని తాను కృష్ణుడి ప్రేమలో పిచ్చిదైన గోపిక లలిత పునర్జన్మగా భావించేది.

Mirabaiమిరాబాయికి ప్రాపంచిక సుఖాలమీద విరక్తి కలిగింది. శ్రీకృష్ణునిపై విశ్వాసం, భక్తి స్థిరపడిపోయింది. తరచు దివ్యోన్మాదంతో తన్మయం పొందుతూండేది. దేవాలయంలో శ్రీకృష్ణుని దివ్య విగ్రహహం ముందు కూర్చుని కూర్చి పాడుతూండేది. ఈమెపాడే పాటలకు ముగ్ధులై అనేక మంది భక్తులు చేరేవారు. ఏమే పారమార్థిక జీవితం ఉపద్రవకరంగా ఉందని రాజవంశీయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోడానికి ఈమెను హత్యచేయడానికి ప్రయత్నించారు.

Mirabaiఒక బుట్టలో పామును పెట్టి పూవులదండ అని చెప్పి ఆమె ఆ పామును పూలమాలగా కంఠంలో ధరించింది.మరొకసారి ఒక చిన్న బంగారుగిన్నెలో విషం కలిపిన పాలు ఇచ్చారు. నిర్భయంగా ఆ పాలను త్రాగింది. ఒకానొక సమయంలో మీరా కృష్ణాయిజానికి కేంద్రమైన బృందావనానికి వెళ్ళిపోయింది. ఇందులో ఒకచోట ఆమె ఆ సమయంలో బృందావనంలో గురు సాధువు చైతన్య ప్రత్యక్ష అనుయాయి రూపా గోస్వామితో ఆధ్యాత్మిక విషయాలను గురించిన చర్చ జరపాలన్న కోరిక వెలిబుచ్చింది, ఘోటక బ్రహ్మచారి అయిన ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించారు. దీనికి మీరా ఈ విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం కృష్ణుడు మాత్రమే అని బదులిచ్చింది. ఆమె తన తీర్థయాత్రను కొనసాగిస్తూ ఒక గ్రామంనుంచి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ దాదాపు మొత్తం ఉత్తర భారతాన్నంతా చుట్టింది.

Mirabaiఆమె తన జీవిత చరమాంకాన్ని భక్తురాలిగా గుజరాత్ లోని ద్వారకలో గడిపింది. కృష్ణుడితో కలయికకై ఆమె పడే తపన ఆమె కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె నీలపు రంగు కావాలని కోరుకొనేది. ద్వారకలో మీరా శ్రీకృష్ణ విగ్రహం ముందు నిలిచి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని వేడుకుంది. నాట్యంచేసి శ్రీకృష్ణునిపై రచించిన భక్తి పాటలు పాడింది. శ్రీకృష్ణ విగ్రహం పాదాలపై బడి పాదాలను కళ్ళకు అద్దుకుంది. చివరగా చూస్తూండగానే శ్రీ కృష్ణ విగ్రహంతో ఐక్యమైపోయింది.

Mirabaiఇక ఆ తరువాత గుజరాత్ లోని చిత్తోర్‌ఘడ్ కోటలోనే ఆమెకు ఒక దేవాలయాన్ని నిర్మించారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR