శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు కొలుస్తారు ?

శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం,పూర్ణఫలం అనికూడ అంటారు.చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ అని పెద్దల వాక్యం. మనస్సే అన్నింటికీ కారణం. ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుని కళలతో మనస్సు ప్రభావితం అవుతుందని పెద్దలు చెబుతారు. రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి చంద్రుడు కారకుడు.

శ్రీలక్ష్మీ ఫలంచంద్రుని ఆధారంగా ఆ నక్షత్రం యొక్క ప్రభావంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనావేస్తాం. అంటే మనస్సు, తెలివితేటలు, గ్రహణశక్తి, మతిమరుపు, చిత్తచాంచల్యం, ఇంద్రియనిగ్రహం, సౌందర్యం, లావణ్యం, శరీరసౌఖ్యం మొదలైనవి. సూర్యచంద్రకాంతుల ప్రభావం మనపై ఉంటుంది. సూర్యకాంతి వల్ల శారీరక ఆరోగ్యం, చంద్రకాంతి వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతాయని గుర్తించాలి. అందుకే ఇంటిలోకిసూర్య, చంద్రకాంతి పడేలా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు ,బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు దొరుకుతాయి.

శ్రీలక్ష్మీ ఫలంశ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి.శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి. శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి.కొబ్బరికాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరికాయలకు ఉండే విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

శ్రీలక్ష్మీ ఫలంశ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పసుపు,గంధం శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్ట్లు పెట్టాలి. శ్రీఫలమ్ చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు,యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపాలి.తరువాత పసుపు గాని,ఎరుపు గాని,తెలుపు గాని వస్త్రాన్నితీసుకొని శ్రీలక్ష్మీ ఫలాన్ని ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి.శ్రీలక్ష్మీ ఫలంతో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే. “ఓం శ్రీం శ్రియై నమః”అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేయాలి.

శ్రీలక్ష్మీ ఫలంజాతకంలో చంద్రుడు పాపస్థానాలలో ఉన్న నీచంలో ఉండి శుభగ్రహ దృష్టి లేకపోయిన మానసిక సమస్యలు ఎదుర్కొంటారు.అమావాస్య పౌర్ణమి రోజులలో ఉద్రేకాలకు లోనవుతారు.ఇలాంటి వారు ఎల్లప్పుడు శ్రీఫలాన్ని దగ్గర ఉంచుకుంటె మంచిది.శ్రీ ఫలం తాంత్రిక ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది. జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉంటే బాలారిష్ట దోషం అంటారు.బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీపలాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మెడలో గాని ,నడుముకి గాని కట్టుకోవాలి. ప్రజాపయోగ వ్యాపారసంస్థలలో,వాటర్,రియల్ ఎస్టేట్,పాల వ్యాపారసంస్థలలో తప్పనిసరిగా శ్రీపలాన్ని పూజించాలి. ఈ ఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.శ్రీ ఫలాన్ని వ్యాపారస్ధలంలోను, ఆపీసుల్లో ఉంచిన సత్వర ఆర్ధికాభివృద్ధి ఉంటుంది. శ్రీ ఫలాన్ని పూజచేసుకొని దగ్గర ఉంచుకొనేవారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వవు. శ్రీ లక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడు నాణేలను ఉంచాలి.

శ్రీలక్ష్మీ ఫలంశ్రీ ఫలాన్ని వ్యవసాయం చేసే వారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి. వాయువ్య దిక్కు దోషం ఉన్నవారు 11 శ్రీపలాల్ని తెల్లగుడ్డలో చుట్టి వాయువ్య దిక్కున ఉంచిన దోష నివారణ జరుగుతుంది. పిట్స్,మతిమరుపు,స్త్రీలకు ఋతు సమస్యలు,గర్బాశయ సమస్యలు ఉన్న వారు శ్రీపలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR