శ్రీవారికి ఈ మాసంలో సుప్రభాతసేవ చేయరు ఎందుకంటే???

భూలోకవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి సుప్రభాతం తెలుపుతూ ఆయన గుణగణ చేష్టితాలను కీర్తించే 70 శ్లోకాలున్న లఘుకృతి శ్రీ వేంకటేశ సుప్రభాతం.
శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసాలలో ధనుర్మాసం కూడా ఒకటి. ఈ ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం శ్రీవారికి అందే సేవలకు బదులుగా ప్రత్యేకమైన పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.
ఈ ఒక్క నెల మాత్రం శ్రీవారికి ప్రత్యేకం అనే చెప్పాలి.
మరి ఈ ధనుర్మాసంలో స్వామి వారికి నిర్వహించే ప్రత్యేక పూజలు ఏంటో తెలుసుకుంధాం…
ప్రతి రోజు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు ఆలయ అర్చకులు.
ఎందుకంటే ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీవారిని తన భర్తగా భావించి అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీవారి పూజలు నిర్వహించి ముప్పై పాసురాలను రచించింది.
వాటినే గోదాదేవి పాసురాలు అంటారు.
అందుకే ఈ ధనుర్మాసంలో సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి రచించిన ఒక్కో పాసురాని ఒక్కో రోజు పటిస్తూ ఉంటారు అర్చకులు. అలా ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలను పటిస్తూ శ్రీవారిని మేల్కొలుపడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.
తిరిగి జనవరి 15వ తేదీన సుప్రభాత సేవను పునరుదరిస్తారు. అంతేకాకుండా శ్రీవారికి చేసే సహస్రనామార్చనలో ఉపయోగించే తులసి దళాలకు బదులుగా ధనుర్మాసంలో బిల్వపాత్రలతో నిర్వహిస్తారు.
అలాగే శ్రీవారికి చేసే ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి చేయకుండా శ్రీకృష్ణ భగవానుడికి నిర్వహిస్తారు.
అలాగే ఈ ధనుర్మాసంలో స్వామి వారికీ ప్రత్యేక నైవేధ్యాలను నివేదిస్తారు ఆలయ అర్చకులు. శ్రీవారికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దోసెలు నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం దోసెలకు బదులుగా బెల్లం పాకంలో ఉంచిన ప్రత్యేక దోసెలని శ్రీవారికి నివేదిస్తారు అర్చకులు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR