“శివుడి ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు” అనే విషయం అందరికి తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమి జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది
మన దేశంలో చాలా వింత ఆచారాలు కలిగిన భిన్నమైన శివుని ఆలయాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న కొన్ని ఉత్సవాలను ఇప్పటికీ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండడం విశేషం.
భక్తులు కుక్కల్లాగా మారి పాలు తాగుతూ, అరిచే ఈ కార్యక్రమాన్ని ఒగ్గుసేవగా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దొన్నెలలోని(గిన్నెలలో) వేసిన పాలను గొరువయ్యలు శునకాల్లాగా అరుచుకుంటు కొట్టుకుంటూ నాలుకలతో తాగుతారు.
ఈ విధంగా ఈ ఆచారాన్ని బ్రహ్మోత్సవాలలో చివరి రోజున నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు గిన్నెలలో పాలు పండ్లు వేసి వాటిని వరుసగా ఉంచుతారు.
అది తాగిన పరమేశ్వరుడు నిద్రపోకుండా ఉండడం కోసం రాత్రంతా పెద్ద ఎత్తున దేవతలందరూ భజనలు చేస్తూ ఉంటారు. అయితే కొంత సమయానికి దేవతలు నిద్రపోవడంతో పార్వతీదేవి ఒక గిన్నెలో ఆరు కుక్కలకు కలిపి పాలు పోయటం వల్ల అవి పాలను తాగటానికి గట్టిగా అరుచుకుంటూ, పోట్లాడుకుంటూ ఉండటం వల్ల ఆ పరమశివుడు నిద్రపోలేదని చెబుతారు.
ఈ విధంగా శివుడు నిద్రపోకుండా చేసిన ఆ భైరవాంశ సంభూత రూపాలే గొరవయ్యలని చెబుతుంటారు. ఈ కారణంగానే ప్రజలు శునకాల్లాగా మారి పాలు తాగుతూ శివుడికి సేవ చేస్తారని భక్తులు విశ్వసిస్తూ ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు.