మాతృత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అందుకే పెళ్ళైన ప్రతీ అమ్మాయి తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే పిల్లల మీద ఎంత ఆశ ఉన్నా కొందరికి పిల్లలు పుట్టడానికి చాలా సమయం పడుతుంది. మరికొందరికి వెంటనే పుడతారు. పిల్లలు పుట్టాలంటే ముఖ్యంగా మహిళల్లో ఎలాంటి గర్భాశయ సమస్యలు ఉండకూడదు. అలా ఉంటే వారికి సంతాన సమస్యలు ఎదురవుతాయి.
అయితే సంతానం కలగాలంటే మహిళల ఆరోగ్యంతో పాటు పురుషుడి వీర్యం కూడా బలంగా నాణ్యంగా ఉండాలి. అప్పుడే సంతానం కలగడానికి సులువు అవుతుంది. మరి ఈ వీర్యం పుష్కలంగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ముందుగా దూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి. ఈ మధ్య కాలంలో సంతాన సమస్యలు ఎదుర్కోవడానికి చాల వరకు ఈ వ్యసనాలే కారణం. వీటివల్ల పురుషుల్లో వీర్యం బలహీనపడిపోతుంది. దానివల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది.
ఇక ఆహరం విషయానికొస్తే మొలకెత్తిన గింజలు, శనగలు అలాంటివి తీసుకోవాలి. బాధం, వాల్నట్స్, హాజెల్ నట్స్ వంటివి స్పెర్మ్ డిఎన్ఎ మిథైలేషన్ పై అధిక ప్రభావాన్ని చూపుతాయి.
రోజూ రెండుసార్లు వీటిని తీసుకుంటే మంచిది. అలాగే నువ్వులు, బెల్లం, జీడిపప్పు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. వారానికి రెండు మూడు రోజులు బెల్లం ఫుడ్ తీసుకుంటే శరీరానికి ఎక్కువగా ఐరెన్ చేకూరుతుంది. ఇది శక్తిని ఇస్తూ స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తుంది.