ఇక్కడ శివున్ని దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనంతో సమానం

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన ఈ మహా శివ లింగం.. ఇక్కడ శివున్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్నంత పుణ్యమట. అంతేకాదు ఈ శివుడ్ని ప్రత్యేకించి రోగనాశకుడిగా పేర్కొంటారు. ఇక్కడి వేడినీళ్ల కుంటలో స్నానమాచరిస్తే శరీరం ఆరోగ్యవంతమవుతుందట. ఆ సుప్రసిద్ధ క్షేత్రమే మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్‌! మరి ఈ క్షేత్ర విశేషాలు, స్థల పురాణం మనం ఇపుడు తెల్సుకుండాం..

Jyothirlingamత్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి వనవాస కాలంలో అనేకానేక అడవుల్లో పర్యటించాడని అంటారు. అందులో భాగంగానే ఉన్కేశ్వర్‌ సమీపంలో సీతా, లక్ష్మణ సమేతంగా నివాసమున్నాడట. ఆ సమయంలోనే ఓ భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించాడట. భక్తుడి మీద అపార కరుణావాత్సల్యాలు కలిగి ఉండే దశరథనందనుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలోని శివుడూ విశేష మహిమాన్వితుడే. ఉన్కేశ్వర్‌ దండకారణ్యంలో శ్రీరామచంద్రుడు పాదం మోపడంతో పరిసర ప్రాంతమంతా పవిత్రమైందని చెబుతుంటారు. వాల్మీకి రామాయణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. పూర్వం శర్భంగుడు అనే ఋషి ఉన్కేశ్వర్‌ పరిసరాల్లోని దట్టమైన అడవుల్లో రామజపం చేస్తుండేవాడట. అతనికి చర్మవ్యాధులు సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయినా క్షణం విరామం లేకుండా రామనామాన్ని స్మరిస్తూనే ఉండడాన్ని శ్రీరామచంద్రుడు గ్రహించాడట.

Sri Ramఅందుకే ఆయన వనవాస కాలంలో ఉన్కేశ్వర్‌ దండకారణ్యం లోకి వచ్చి శర్భంగుడ్ని కలవాలను కున్నాడట. అయితే రాముడిని దర్శించుకోవడానికి శర్భంగుడు తన రూపాన్ని అడ్డంకిగా భావించాడు. ఆ విషయాన్ని లక్ష్మణుడు పసిగట్టాడు. ఈ విషయాన్ని రాముడికి వివరించాడు. చలించిపోయిన రాముడు ఉన్కేశ్వర్‌వైపు రెండు బాణాలు సంధించాడట. అందులో ఒకటి వ్యాధులను మటుమాయంచేసే సరోవర స్థాపనకూ, మరొకటి మహాశివ లింగ ప్రతిష్ఠాపనకూ కారణమయ్యాయి. అనంతరం శర్భంగ ఋషికి దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు తొలుత వేడినీటి సరోవరంలో స్నానమాచరించి, మహా శివలింగాన్ని పూజించమని చెప్పాడు. అలాచేసిన శర్భంగఋషి వ్యాధులన్నీ మటుమాయమయ్యాయి. అనంతరం అటవీ పరిసరాల్లోని ఎందరికో ప్రకృతి వైద్యం అందజేసిన శర్భంగ ఋషి జీవసమాధి అయ్యాడట. ప్రస్తుత దేవాలయం ఆయన సమాధి దగ్గరే నిర్మించారట..

Jyotirlingamఅందుకే త్రేతాయుగం నుంచీ నేటి వరకూ ఈ చోటికి భక్తులు బారులు కడుతూనే ఉన్నారు. ఉన్కేశ్వర్‌ శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ తాలూకా మాండ్వి దండకారణ్యం పరిసరాల్లో విరాజిల్లుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌సరిహద్దులో ఉన్న ఈ దేవాలయంలో భక్తులకు ఉచిత ప్రకృతి వైద్యమూ అందిస్తుంటారు… అందులోనూ చర్మవ్యాధులు బాగా నయమవుతాయని భక్తుల నమ్మిక.

Jyotirlingamఈ ఆలయంలోని వేడినీటి సరోవరంలో కొన్నిరోజులపాటు వరుసగా స్నానమాచరిస్తే ఎంతటి చర్మవ్యాధులైనా నయమవుతాయన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి నీళ్లలో ఉండే సల్ఫర్‌ వల్ల ఇది సాధ్యమవుతోందన్నది నిపుణుల మాట. దేశం నలుమూలల నుంచి ఎందరో వ్యాధిగ్రస్తులు ఇక్కడికొస్తుంటారు. ఇక్కడి వేడినీటి సరోవరంలోని నీటితో స్నానమాచరించి, దైవదర్శనం చేసుకున్న తర్వాత యోగా, ధ్యానం, తదితర వ్యాయామాలు చేస్తారు. తెల్లమచ్చలు, సొరియాసిస్‌, పక్షవాతం, స్కెలిరోడర్మ తదితర వ్యాధులవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఆలయం వారే ఇక్కడ ఒక ప్రకృతి వైద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.

Jyotirlingamఇచట శైవ సంప్రదాయం ప్రకారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో హారతితో పూజ మొదలవుతుంది. అనంతరం గాయత్రి మంత్ర జపంతో ఆలయం మార్మోగుతుంది. రోజూ భజనలు జరుగుతాయి. ఈ ఆలయంలో దత్తాత్రేయుడి ప్రతిమా ఉంది. మహాశివరాత్రి, దత్తజయంతి, రామనవమి, వినాయక చవితి పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, దత్తజయంతులకి జాతర జరిపిస్తారు..

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR