Home Unknown facts ఘటోత్కచుడు శ్రీకృష్ణుని దగ్గర పొందిన వరం

ఘటోత్కచుడు శ్రీకృష్ణుని దగ్గర పొందిన వరం

0

మహాభారతంలో పాండవులు లక్క ఇంటిని నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్రి ఒకచోట విశ్రమిస్తారు. అందరూ నిద్రపోతుండగా భీమసేనుడు కాపలాగా ఉంటాడు. వారికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి, తండి అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు. తండి పాండవుల వాసనను పసిగట్టి అక్కడ బాగా బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారంగా తీసుకుమ్మని హిడింబిని పంపిస్తాడు.

Ghatotkachuduకానీ హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్ళాడమని భీముని కోరుతుంది. భీముడు అందుకు అంగీకరించడు. ఆమె తన నిజస్వరూపం ధరించి తన అన్న చెప్పిన పని గురించి చెబుతుంది. భీముడు తండితో యుద్ధానికి తలపడతాడు. ఆ పోరులో భీముడు తండిని సంహరిస్తాడు. సోదరుని మరణంతో తనమీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు.

అయితే ధర్మరాజు అడ్డుకొని ఒక మహిళను చంపడం భీముని వంటి వీరునికి తగదని వారిస్తాడు. తరువాత హిడింబి తను ఒంటరిదానను కాబట్టి పెళ్ళి చేసుకోమని భీముడిని ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది. అప్పుడు కుంతీ దేవి హిడింబిని పెళ్ళాడమని కుమారుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. అయితే భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు.

హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు. తల కుండ లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. అతని మంత్ర తంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.

మహాభారత యుద్ధంలో పాండవుల తరుపున ఘటోత్కచుడు ప్రముఖ పాత్ర పోషిస్తాడు. కౌరవ సేనను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. కురు సైన్యాన్ని చిందరవందరగా చేసి రణరంగంలో బీభత్సం సృష్టించాడు.

తనని నిలువరించలేక చివరికి అర్జునుడిని ఆచరించడానికి ఇంద్రుని దగ్గర నుండి వరంగా పొందిన అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు కర్ణుడు. నేలకొరుగుతూ కూడా లక్ష మంది సైన్యాన్ని మట్టు బెట్టాడు. ఘటోత్కచుడి భారీ కాయం కింద పడి దాదాపు లక్ష మంది సైనికులు మరణించినట్టు చరిత్ర చెబుతుంది.

 

Exit mobile version