సర్వ దరిద్రాలను తొలగించే ”కోజాగిరి వ్రతం” మహత్యం

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికి, కొలిచినవారికి కొంగుబంగారమై వరాలనిచ్చేది మహాలక్ష్మే .

కోజాగిరి వ్రతంసౌభాగ్యాలను సిరి సంపదలను, ప్రసాదించాలని ప్రతిఒక్కరు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తారు. అటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన వ్రతం కూడా ఒకటుంది. అదే ‘కోజాగిరి వ్రతం’. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వదారిద్ర్యాలు తొలగిపోయి, లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తుందని వాలిఖిల్య మహర్షి వివరించినట్లు పురాణాలలో ఆధారాలు కూడా వున్నాయి. అన్ని వ్రతాల్లోకెల్లా ఈ వ్రతం లక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి.

కోజాగిరి వ్రతంపురాణాల ప్రకారం పూర్వం మగధదేశంలో “వలితుడు” అనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడట. అతను గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమగయ్యాళి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ఉండేది. వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధ చూసి, ఆలోచించి “నీవు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది. కాబట్టి నీ పని జరుగుతుంది” అని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు “రేపు మా తండ్రిగారి ఆబ్ధికం, అయినా నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు” అని భార్య చండితో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది.

కోజాగిరి వ్రతంఅన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో “పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి” రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయింది. నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కలా గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వారికీ వివరించాడు. ఈ రోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని వున్నారో చూడడానికి రాగా, వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు.

కోజాగిరి వ్రతందీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలిఖిల్య మహర్షి వివరించాడట. కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి, ఆ రాత్రి జాగరణ చేస్తూ, పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. చాలా పురాణాల్లో పాచికల ప్రస్తావన ఉంది. కొంతమంది పాచికలు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR