Home Unknown facts నాగుపాము పుట్టకు పూజ చేస్తే దోషాలు తొలుగుతాయా ?

నాగుపాము పుట్టకు పూజ చేస్తే దోషాలు తొలుగుతాయా ?

0

ప్రకృతి సకలజీవరాసులకు నిలయం. ఈ ప్రకృతి లోని ఆణువణువూ మానవ మనుగడకు జీవనాధరమైనది. కనుకనే దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని – ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ పూజిస్తూవస్తున్నారు. అందులో భాగంగానే ‘ నాగుపాము” ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట.

నాగుల చవితినాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీనప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసం. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. వాస్తవానికి పుట్టలో పాలు పోయకూడదు. పుట్టకు పాలుపోయలనుకునే వారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచుడు లేదా దోప్పను పెట్టి అందులో పాలు పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు. పాము విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చును. మన పుణ్య కార్యం వలన వాటికి ఆనందం కలగాలి కానీ ఇబ్బంది కాకూడదు.

ఇక పుట్టకు కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంద్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళె మార్గానికి అంతరాయం కలిగించకూడదు. పుట్టపై బియ్యం పిండిలో చక్కర కలిపి పుట్టపై చల్లాలి, దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్య ఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. ఇక పూజకోరకు తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగరం, వెండితో చేసిన ఐదు నాగపడిగేలను పుట్టలో వేసి దూప, దీప, నైవెద్యాలు సమర్పరించిన తర్వత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళను పుట్టపై చల్లాలి.

చివరగా అక్షితలు చేతిలోపట్టుకుని మనస్సులో దాగిఉన్న కోరికలను నాగాదేవతకు విన్నవించుకుంటూ పుట్టచుట్టూ మూడు ప్రదక్షిణలు భక్తిశ్రద్ధలతో చేయాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగ ,ఆడవారు మోకాలి పై వంగి , గర్భిని స్థ్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే గర్భ సంబంధమైన దోషాలనుండి ఉపశమనం దొరుకుతుంది.

మన పెద్దలు ఏం చేసినా దాని వెనుక శాస్త్రీయ కారణాలు ఉంటాయనేది తెలిసిందే కదా… ఈ నాగుల చవితి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘ వెన్నుపాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో పాము ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది.

ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ… కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందట. అందుకు ‘ నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ‘ శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరుకోవడమే ఈ పుట్టలో పాలు పోయడం వెనుక గల అంతర్యమని పెద్దల మాట.

 

Exit mobile version