పంచవటి అని పేరు రావడానికి గల కారణం ఏంటో తెలుసా ?

రామాయణం ప్రకారం సీత దేవిని రావణుడు అపహరించిన ప్రదేశం పంచవటి. సీతారామలక్ష్మణులు పినతల్లి కైకేయికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి,తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసానికి వెళతారు. ఆ సమయంలో నాసిక్ లోని గోదావరీ తీరానికి చేరుకొన్న వారు అగస్త్య మహాముని సూచన మేరకు ఈ ప్రాంతంలో పర్ణ కుటీరం నిర్మించుకుని,నివసించారు. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఉందని కధనం. అయితే ఈ స్థలానికి పంచవటి అని పేరు రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.panchavati

ఇక్కడ ఐదు పెద్ద పెద్ద చెట్లు వున్నాయి. వీటినే పంచవటి గా పిలుస్తారు. ఆ చెట్లకి 1,2,3,4,5 అని నంబర్లు కూడా వేసి ఉంచారు.

1. వటవృక్షం:

వటవృక్షంవటవృక్షం కింద ప్రార్థనలు చేయటం అనాది కాలం నుంచి వస్తోంది. ఈ వృక్షాన్ని విష్ణుమూర్తి అంశగా భావిస్తారు. అందుకే స్వామికి వటపత్రశాయి అని పేరు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు గీతను బోధించింది కూడా వటవృక్ష సమీపంలోనే! కురుక్షేత్రంలో దాదాపు అయిదువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వృక్షం నేటికీ దర్శనమిస్తుంది.

2. బిల్వవృక్షం:

బిల్వవృక్షంబిల్వపత్రాలతో శివుని పూజిస్తారు. బిల్వవృక్షం సాక్షాత్తూ శివస్వరూపమని అంటారు. ఒకానొక సమయంలో శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు సాక్షాత్తూ ఆ మహాదేవుడే ఈ మారేడుచెట్టుగా మారి అజ్ఞాతంగా ఉన్నాడని పురాణాలూ చెబుతున్నాయి. అందుకే బిల్వపత్రాలతో శివుని పూజించిన వారిపై శనిప్రభావం ఉండదని భక్తులు నమ్ముతారు. ఆనాటి నుంచి నేటికీ పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో అర్చన చేయటం ఆనవాయితీగా వస్తుంది.

3. అశ్వత్థవృక్షం:

అశ్వత్థవృక్షంపలు దేవతామూర్తులు అశ్వత్థవృక్షం నీడలోనే అరాధనలు అందుకుంటాయి. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ వృక్షం కిందే. అందుకే దీనిని బోధివృక్షం అని కూడా పిలుస్తారు. బౌద్ధభిక్షువులకు ఇది అత్యంత పవిత్రమైంది. తొలిరోజుల్లో గౌతమబుద్ధుడి పాదముద్రలు, చిహ్నాలను, పాదుకలను ఆయన స్మృతులుగా ఈ చెట్టు వద్దే పెట్టి ధ్యానించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో గ్రామదేవతలు రావిచెట్టు మూలల్లోనే కొలువుతీరటం విశేషం. అందుకే ఈ అశ్వతవృక్షాన్ని ‘స్థలవృక్ష’గా భావిస్తూ ఇక్కడి భక్తులు ఆరాధిస్తారు.

4. నింబవృక్షం:

నింబవృక్షంసాయిబాబా జీవితంలో ఈ నింబవృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పదహారేళ్ల వయస్సులో బాబా షిర్డీలో తొలిసారిగా ఓ వృద్ధ భక్తురాలికి దర్శనమిచ్చింది ఈ నింబవృక్షం కిందే! బాబా అంశగా భావించే అక్కల్‌కోటకర్‌ మహారాజు పాదుకలు షిర్డీలో ఈ వేపచెట్టుకిందనే ఆయన భక్తుడు ప్రతిష్టించారు.

5. ఆమ్లాక వృక్షం:

ఆమ్లాక వృక్షంనదీస్నానాల్లో, నదీపూజల్లో దీపారాధానకు ఉసిరికి ప్రత్యేక స్థానం. వీటి మధ్యలో దీపాన్ని పెట్టి వెలిగించటం ఆనవాయతీ. ఈ అయిదు వృక్షాలు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరం. అందుకే పంచవటి పారమార్థిక సాధనలో అంత ప్రాధాన్యం సంతరించుకుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR