దుష్ట శక్తిని అంతం చేయడానికి అగ్ని నుండి వెలిసిన వల్లూరమ్మా

ప్రతి గ్రామంలో గ్రామదేవతకి సంబంధించిన ఆలయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా పూర్వం దుష్ట శక్తిని అంతం చేయడానికి అగ్ని నుండి వల్లూరమ్మా తల్లి వెలిసిందని పురాణం. మరి వల్లూరమ్మా తల్లి ఎలా వెలసింది? ఈ తల్లి వెలసిన ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Valluramma Ammavari Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా లో వల్లూరు అనే గ్రామంలో శ్రీ వల్లూరమ్మా ఆలయం ఉంది. ఈ తల్లి ఎన్నో మహిమలు గల తల్లిగా పేరు గాంచినది. భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ, భూతపిశాచాలను సైతం వణికించిన తల్లి వల్లూరమ్మా.

Sri Valluramma Ammavari Temple

ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒంగోలు ప్రాంతానికి అవతలివైపున ఉండే ప్రాంతాలు వేంకటగిరి రాజుల అధీనంలో ఉండేవి. ఒంగోలు ప్రాంతం మందపాటి రాజుల అధీనంలో ఉండేది. అయితే కొన్ని కారణాల వలన ఈ రెండు రాజ్యాలకి శత్రుత్వం విపరీతంగా ఉండేది. దీంతో ఒకసారి వేంకటగిరి గిరి రాజు కేరళ మాంత్రికుడిని రప్పించి ఒంగోలు రాజ్యంపైన భూతశక్తిని ప్రయోగించాడట. అప్పుడు ఆ రాజ్యంలోని పశువులు, ప్రజలు ఒక్కొక్కరిగా చనిపోతుండగా ఆ రాజు మహా చండీయాగం జరిపించగా ఆ యాగానికి ఆహుతిగా అద్దంకి నాంచారమ్మని ఆహ్వానించారు. ఇక ఈ యాగం ముగిసే సమయానికి అగ్ని నుండి ఒక దివ్యమూర్తి ఉధ్భవించి జ్వాలాగా మారగా ఆ జ్వాలా రూపం స్త్రీ రూపంగా మారి ఆ ప్రదేశంలోనే వల్లూరమ్మా గా ఆవిర్భవించింది.

Sri Valluramma Ammavari Temple

ఇక ఆ తల్లి స్వయంభువుగా వెలసిన తరువాత దుష్టశక్తులు పూర్తిగా అంతం అయినాయి. ఈ తల్లికి అద్దంకి నాంచారమ్మ, ఇతముక్కుల జ్వాలాముఖి అనే అక్కలు ఉన్నట్లుగా చెబుతారు. అందుకే భక్తులు వీరి ముగ్గురిని అక్కచెల్లెళ్లుగా భావించి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయ విషయానికి వస్తే, దుష్ట శక్తుల పాలిట సింహస్వప్నం అయినా ఈ తల్లి కొలువైన ఈ ఆలయానికి కొత్తగా వాహనాలు కొన్న వారు వారి వాహనాలకు ఇక్కడ పూజలు చేస్తుంటారు. శక్తి స్వరూపమైన ఈ తల్లి కొలువై ఉన్న ఈ ఆలయానికి దేవి నవరాత్రులు, సంక్రాంత్రి సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Sri Valluramma Ammavari Temple

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR