లక్ష్మీదేవి అంశగా జన్మించిన పద్మావతి తను వివాహం వేంకటేశ్వరస్వామి తప్ప ఎవరిని చేసుకోను అని ఆ స్వామికోసం తపస్సు చేసి ఈ పవిత్ర ప్రదేశంలోనే వివాహం చేసుకుందని స్థల పురాణం. మరి ఆలయం ఎక్కడ ఉంది ? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నారాయణవనంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరాలయం ఉన్నది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం అరుణానది తీరంలో ఉంది. ఈ ఆలయం నందు గర్భగుడిలో కల్యాణ వేంకటేశ్వరుడు పక్కనే మరొక చిన్న గుడిలో పద్మావతి అమ్మవారు దర్శనం ఇస్తారు. పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలి రాయి కలదు. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెబుతారు.
ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఆకాశరాజు పాలించేవాడు. ఈ ఆలయం ఆయనే కట్టించారని స్థల పురాణం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర రూపంతో వేంకటాద్రి మీద వెలిసాడు. ఇక లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకి పుత్రికగా జన్మించింది. ఆ తరువాత యుక్త వయసుకి వచ్చిన పద్మావతీదేవి వేంకటేశ్వరుని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించమని తన తండ్రిని కోరింది.
అప్పడు కుమార్తె కోరికను మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర, పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతి వైభవంగా జరిపించాడని ఆ కల్యాణానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి.
ఈ ఆలయ చరిత్ర ప్రకారం క్రీ.శ. 1544 లో అచ్యుత దేవరాయల ఆంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్న ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉన్నది. ఆలయం చుట్టూ కూడా ఉన్నతమైన ప్రాకారము కలదు. ఈ ప్రాకారం తూర్పు దిశలో 96 అడుగుల ఎత్తు గల 7 అంతస్తులు కలిగిన గోపురంతో శిల్పకళా సౌదర్యంతో విరాజిల్లుతుంది.
ఈ అలియానికి కొంత దూరంలో ఉన్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమి నుండి అయిదు రోజులు స్వామివారి తెపోత్సవం, జ్యేష్ఠ శుద్ధ దశమి నుండి పదిరోజులు బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుపుదురు. ఈ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
Venkateshwars swamy, Padmavathila kalyanam jarigina Pavithrasthalam
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.