ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారని ప్రతీతి. అమ్మవారు వెలసిన శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడ వెలసింది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఆదివారం, గురువారాలలో వేల సంఖ్యలో భక్తులు ఈ మైసమ్మను దర్శిస్తుంటారు. అన్నివర్గాల ప్రజలచే నిత్యం పూజలు అందుకుంటూ ఈ దేవత మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే జాతరకు భక్తులు విశేషంగా వస్తారు.