భీష్ముని చంపగలిగే శిఖండి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి?

పంచమవేదంగా పేర్కొనే మహాభారతంలో ఊహకందని మలుపులు, చిత్రమైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇందులో బలమైన పాత్రలే కాదు విచిత్రమైన వ్యక్తులు కూడా ఉన్నారు. వారిలో శిఖండి పాత్ర కూడా ఒకటి. ఈ పాత్ర భారతీయ పురాణాల్లో తొలి లింగమార్పిడి మహిళ. పుట్టుకతో స్త్రీగా జన్మించిన శిఖండి పగ తీర్చుకోవడానికి తరువాతి కాలంలో పురుషుడిగా మారింది.

Shikandiభీష్ముడు తన తమ్ముడు విచిత్రవర్యుడిని హస్తినాపుర రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. అతడికి వివాహం చేయాలని సంకల్పించిన భీష్ముడు కాశీరాజు ఇంటికి అతిథిగా వెళ్లి ఆయన కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తీసుకొచ్చాడు. వారిని హస్తినకు తీసుకొచ్చే క్రమంలో అంబ శాల్వ రాజును ప్రేమిస్తున్నట్లు తెలుసుకుని ఆమెను విడిచిపెడతాడు. అయితే భీష్ముడు బంధించి తీసుకెళ్లిన నిన్ను వివాహం చేసుకోనని అంబను శాల్వ రాజు తిరస్కరించాడు. దీంతో అంబ కోపానికి, తీవ్ర దు:ఖానికి తానే కారణమని భీష్ముడు అర్థం చేసుకుంటాడు.

Kurukshetramఆ తర్వాత అంబ భీష్ముని గురువైన పరుశరాముని కలిసి ఈ విషయం తెలియజేస్తుంది. ఆమె మాటలు విన్న పరుశరాముడు అంబను వివాహం చేసుకోమని భీష్ముడిని కోరుతాడు. కానీ తాను వివాహం చేసుకోనని ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని తన పినతల్లికి ఇచ్చిన మాటకోసం భీష్ముడు నిరాకరిస్తాడు. దాంతో అంబ విషన్న వదనంతో మౌనంగా ఉండిపోయింది. ఇద్దరు పురుషులు తనను నిరాకరించడంతో దీనికి కారణమైన భీష్ముడిపై ప్రతీకారం తీసుకోవాలని భావించింది. యమునా నది ఒడ్డున తపస్సు చేస్తూ ప్రాణత్యాగం చేసింది.

Shikandiఆమె ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు ఆమె చనిపోయే ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. యుద్ధ రంగంలో భీష్ముడు తన చేతిలో పరాజయం పొందేలా వరం ప్రసాదించమని కోరుతుంది. ఆమె కోరికను మన్నించిన శివుడు ఆ వరం ప్రసాదించాడు. అయితే తాను స్త్రీ రూపంలో ఉంటే ఎలా సాధ్యమని గందరగోళంలో ఉన్న అంబ సందేహాన్ని శివుడు దూరం చేసాడు. వచ్చే జన్మలో స్త్రీ రూపంలో జన్మించినా తర్వాత పురుషుడిగా మారుతావని తెలిపాడు. అప్పుడు నీ చేతిలో భీష్ముడు మరణిస్తాడని వివరించాడు. వెంటనే అంబ అత్మార్పణ చేసుకుని ద్రుపదుడి కుమార్తెగా జన్మించి తర్వాత శిఖండిగా మారింది.

Shikandiకురు పాండవుల మధ్య సయోధ్యకు సంజయుడు, కృష్ణ‌ుడు రాయబారం జరపినా విఫలమవడంతో యుద్ధం అనివార్యమైంది. దీంతో ఇరు వర్గాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో పాండవుల తరఫున పాల్గొనే ఏ వీరుడితో యుద్ధం చేస్తారని బీష్ముడిని దుర్యోధనుడు అడిగాడు. ద్రుపదుడి కుమారుడు శిఖండితో తప్ప ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమని భీష్మ పితామహుడు సమాధనం ఇచ్చాడు. ఎందుకంటే శిఖండి పుట్టుకతో స్త్రీ కానీ శివుడి వరం వల్ల పురుషుడిగా మారినట్లు తెలియజేస్తాడు. ఇందుకు దారితీసిన పరిస్థితులు గురించి కూడా దుర్యోధనుడికి వివరించాడు. ఆ మాట ప్రకారమే భీష్ముడు కురుక్షేత్రంలో శిఖండి ముందు నిశస్త్రుడై నిలబడగా అర్జునుడు తన బాణాలతో భీష్ముడిపై దాడి చేస్తాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR