త్రిశంకు స్వర్గం సృష్టించడానికి వెనుక గల చరిత్ర ఏమిటి ?

త్రిశంకు స్వర్గం అనే మాట మన పురాణాల్లో చాలాసార్లు వినే ఉంటాం. కానీ త్రిశంకు స్వర్గం సృష్టించడానికి మునుపు చరిత్రలో జరిగిన విషయాలు చాలా మందికి తెలియదు. అసలు త్రిశంకు స్వర్గం అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిశంకు స్వర్గంపూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. తన పూర్వ వంశీయులలా కాకుండా, తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది. వెంటనే తన కోరికను కులగురువులైన వశిష్ఠుడికి చెప్పుతాడు త్రిశంకుడు. తాను శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి ఏదైనా యాగం చేయమని వశిష్టుని కోరతాడు. అయితే ఇది జరగని పని అని, శాస్త్రాలకు, దర్మాలకు విరుద్దం అని వశిష్టుడు చెబుతాడు. దాంతో త్రిశంకుడు, వశిష్ఠుని 100 మంది కొడుకుల దగ్గరకు వెళ్ళి తనకోరిక తెలియచేస్తాడు.

త్రిశంకు స్వర్గంకానీ శరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనే కోరిక తీరదు అని వశిష్టుని కుమారులు కూడా చెబుతారు. అప్పుడు త్రిశంకుడు మీ వల్ల అవ్వదు, నేను వేరే గురువుని కలుస్తా అని అంటాడు. ఆ మాట విన్న వశిష్ఠకుమారులు కోపంతో త్రిశంకుని శపిస్తారు. త్రిశంకుడి శరీరంపై ఉన్న బంగారు నగలు ఇనుము వస్తువులుగా మారుతాయి.వెంటనే అతడు ఛండాలుడుగా మారిపోతాడు. స్దిమితం లేక ఊరుమీద తిరుగుతూ ఉంటాడు.

త్రిశంకు స్వర్గంఅలా ఓ రోజు దక్షిణ తీరంలో తపస్సు ముగించిన విశ్వామిత్రుడిని చూసి తన బాధను, జరిగిన ఉదంతాన్ని చెబుతాడు. త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇస్తాడు. యాగం నిర్వహించి శరీరంతో ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి ఆహ్వానించమంటాడు. మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి పిలిచి తన తపోశక్తితో త్రిశంకుడిని శరీరంగా స్వర్గానికి పంపుతాడు విశ్వామిత్రుడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే వెళ్లమంటాడు.

త్రిశంకు స్వర్గంఅలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, విశ్వామిత్రా రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి స్వర్గాన్ని, నక్షత్రమండలాన్నిచేయడం ఆరంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. అలా త్రిశంకు స్వర్గం సృష్టించబడింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR